Delhi Traffic Jam: ఢిల్లీలో బీజేపీ- ఆప్ పార్టీల ధర్నాలు.. భారీగా ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Jam At Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైపు అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, మరో వైపు బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. చండీగఢ్లో జరిగిన మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆప్ నిరసన తెలుపుతుంది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ ప్రధాన కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. రెండు పార్టీల ప్రధాన కార్యాలయం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో ఉంది. ఈ రెండు పార్టీ ఆఫీసుల దగ్గర పటిష్ట ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Rakul Preet Singh : రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ మిర్చీలా రకుల్ స్టన్నింగ్ పోజులు..
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
దీంతో ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డీఎన్డిలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో రింగురోడ్డుపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇక, రింగ్ రోడ్డులో రెండు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ సౌత్ వెస్ట్ ఏసీపీ తెలిపారు. ట్రాఫిక్ కు నియంత్రించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అదనపు సిబ్బందిని నియమించారు.
Read Also: Kishan Reddy: గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడు?.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ప్రశ్న?
అయితే, మంగళవారం నాడు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరి తదితరులు నిరసన తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!