Record Temperature: అగ్నిగుండంగా ఢిల్లీ.. రికార్డ్ ఉష్ణోగ్రత నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. ఎన్నడూ లేనంత రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఈరోజు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్పూర్లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు పేర్కొంది. రికార్డు ఉష్ణోగ్రతలతో ఢిల్లీ వాసులు బెంబెలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో.. ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. మరోవైపు.. ఢిల్లీలో రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా పలు చోట్ల వర్షం కురుస్తుంది.
Read Also: Share Markets: ఎన్నికల చివరి దశ ముందు అమ్మకాల ఒత్తిడి.. నష్టాలలో మార్కెట్స్..
Also Read
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
- Hyderabad: ఫ్రీజర్లో పురుగులు, స్టోరేజ్లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
మరోవైపు.. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్, 50.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు.. హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు.. అరేబియా సముద్రం నుండి తేమతో కూడిన గాలుల కారణంగా దక్షిణ రాజస్థాన్ లోని బార్మర్, జోధ్పూర్, ఉదయపూర్, సిరోహి, జలోర్లో ఈ రోజు 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. ఇది వాయువ్య భారతదేశంలో వేడి తరంగాల తగ్గింపు ప్రారంభాన్ని సూచిస్తుంది.
Read Also: Chiranjeevi: నన్ను పరుగులు పెట్టించి, శుభం కార్డు వేశారు.. సీనియర్ జర్నలిస్ట్ ఎమోషనల్
భవిష్యత్ వాతావరణాన్ని అంచనా వేయడానికి.. ప్రస్తుత వాతావరణ పరిశీలనలను ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్ మోడల్లను ఉపయోగించే న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ (NWP) డేటా.. ఈ తగ్గుదల ధోరణి మే 30 నుండి వేడిగాలుల పరిస్థితుల నుండి క్రమంగా ఉపశమనాన్ని కలిగిస్తూ ఉత్తరం వైపు మరింత విస్తరిస్తుంది అని తెలిపింది. అదే విధంగా.. గురువారం నుండి బంగాళాఖాతంలో తేమతో కూడిన గాలులు వీస్తుండటం వల్ల ఉత్తరప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
-
Jio Recharge Plans: జియో రూ.949 vs రూ.1029 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీ.. ఏది బెస్ట్?
-
Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
-
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10 లోకి కాంట్రవర్సీ యూట్యూబర్ నందన ?
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!