Stray Dogs: దేశంలో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించే ముందు కొన్ని భద్రత చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. అందులో వీధి కుక్కల్ని బంధిచడం కూడా ఒకటి. ఎందుకంటే వీధి కుక్కలు కొత్తవారిని చూసినప్పుడు లేదా ఆ ప్రాంతంలో ఏదైనా కోలాహలం జరిగినప్పుడు భయంతో మనుషుల్ని గాయపరిచిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ప్రమాదాలను నివారించడానికి స్వాతంత్య్ర , గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు, మరేదైనా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు వీధికుక్కల్ని బంధిస్తారు. కార్యక్రమం పూర్తికాగానే ఆ కుక్కల్ని వదిలేస్తారు. కాగా ఈ మధ్య G20 సదస్సును భారత్ విజయవంతగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో సదస్సుకు ముందు వీధి కుక్కల్ని బంధించారు. ఈ ఘటన పైన “అనితా శాంటియాగో ” దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా వీధి కుక్కల్ని బంధించడంపైన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
నిబంధనలు పాటించకుండా వీధి కుక్కల్ని బంధించడం అమానుషమైన చర్యగా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కాగా బుధవారం విడుదలైన ఉత్తర్వుల ప్రకారం పౌర అధికారులు పట్టుకున్న కుక్కలను విడిచిపెట్టాలని , యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనల ప్రకారం వాటి సంక్షేమం కోసం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అలానే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం నిర్వాహణ లో భాగంగా వీధి కుక్కల్ని బంధించేటప్పుడు అలానే కార్యక్రమం పూర్తికాగానే బంధించిన వీధి కుక్కల్ని వదిలేటప్పుడు ABC నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
అలానే కుక్కల్ని బంధించిన వెంటనే వాటికీ నంబర్లు ఉన్న కాలర్ ఇవ్వాలి. దీని ద్వారా ఆ కుక్కని ఏ ప్రాంతంలో పట్టుకున్నారు అనే విషయం సులువుగా తెలుస్తుంది. తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలిపెట్టడానికి వీలుగా ఉంటుంది. అలానే కుక్కల్ని పట్టుకున్న వెంటనే రికార్డ్స్ నిర్వహించాలి అని పిటిషన్ లో పేర్కొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది MCD సమర్పణను ధృవీకరించారు. అధికారుల వైఖరి దృష్ట్యా, పిటిషన్పై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని కోర్టు తెలిపింది. పిటీషన్ లో అనితా శాంటియాగో పేర్కొన్న విధంగా వీధి కుక్కల్ని బంధించేటప్పుడు మరియు విడిచిపెటటప్పుడు ABC నిబంధనలు కచ్చితంగా పాటించాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.