CM Kejriwal: నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే.. బీజేపీ సంబరాలు చేసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు.
Read Also: Nadendla Manohar: రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ, హోంమంత్రి, రక్షణ మంత్రి సంబరాలు చేసుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. దేశం మొత్తం విషాదంలో మునిగిపోతే.. వారు మాత్రం సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే ఇప్పటికీ ప్రధాని స్పందించలేదన్నారు. వారి కోసం ఒక్క మాట.. ఒక్క ట్వీట్ కూడా చేయలేదని తెలిపారు. ప్రతిదానిపైనా ట్వీట్లు చేసే ప్రధాని, హోంమంత్రి జవాన్ల మరణంపై ఎందుకు ఉలుకు పలుకు లేదన్నారు.
Read Also: Pawan Kalyan Varahi Yatra: నాలుగో విడత వారాహి యాత్రకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్
మరోవైపు విపక్షాల పేరు(INDIA)ను చూసి బీజేపీ భయపడుతోందని కేజ్రీవాల్ తెలిపారు. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడంపై.. ఇప్పుడు దేశం పేరు మారుస్తామంటూ బీజేపీ రెచ్చిపోతుందని పేర్కొన్నారు. భారతదేశం మీ నాన్నగారికి చెందిందా.. భారతదేశం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీకి కేజ్రీవాల్ బహిరంగ సవాల్ విసిరారు. గతేడాది వరకు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపట్టిన బీజేపీ.. ప్రతిపక్షాలు ఇండియాగా పేరు మార్చినప్పుడు పేరు మారుస్తామని చెప్పారు. వచ్చే సమావేశంలో విపక్షాల కూటమికి భారత్ అని పేరు పెడితే.. బీజేపీ భారతదేశం పేరు మారుస్తారా అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!