Nadendla Manohar: రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్
అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలు.. బడి ఈడు పిల్లలపై ప్రభుత్వ దగ్గర ఉన్న లెక్కలను నాదెండ్ల వివరించారు. ఈ ప్రభుత్వంలో సుమారు 2 లక్షలకు పైగా పిల్లల ఆచూకీ తెలియడం లేదు.. సుమారు 3 లక్షల మంది పిల్లల డ్రాపౌట్స్ ఉన్నాయిని ఆయన తెలిపారు.
Read Also: Anil Sunkara: అనిల్ సుంకరపై క్రిమినల్ కేసు?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 3.17 లక్షల కుటుంబాలు వీడి వెళ్లాయని నాదెండ్ల మనోహార్ తెలిపారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి.. సీఎం సొంత జిల్లా కడప నుంచి 21 వేల కుటుంబాలు వలస పోయాయి.. చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని ఆయన అన్నారు.
Read Also: Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..
రోడ్ మార్గం ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ను విజయవాడకు రానియ్యొద్దని అధికారులు చెప్పారని నాదెండ్ల మనోహార్ అన్నారు. అధికారులు అడ్డుకుంటే నడుచుకుంటూ వెళ్లడానికి.. అరెస్ట్ కావడానికి పవన్ సిద్దమయ్యారు.. నాలుగు గంటల పాటు జాతీయ రహాదారిని స్థంభింప చేశారు.. మహిళలు, యువత పవన్ కు అండగా నిలిచారు.. సీఎం పదవిని దీని కోసమేనా వినియోగించేది?అని ఆయన అడిగారు. ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. 52 నెలల నుంచి ఏపీ ప్రజలే పడే బాధలు వర్ణనాతీతం.. 151 స్థానాలతో ప్రజలు వైసీపీని గెలిపించారు.. జనసేన కూడా ప్రజా తీర్పును గౌరవించింది అని మనోహార్ అన్నారు.
Read Also: Matrimony Fraud: మ్యాట్రిమోనీ పేరుతో ఘరానా మోసం
విలువలతో కూడిన రాజకీయం చేయడానికి జనసేన కట్టుబడి ఉందని నాదేండ్ల మనోహర్ అన్నారు. విభజన సమయంలో కుట్ర పూరితంగా ఉప ఎన్నికలు వచ్చేలా తన వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు.. ప్రతి నెలకో ఎన్నిక జరిగేలా కుట్ర చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆనాడు కుట్రలతో జగన్ రాజీనామాలు చేయించారు.. ఓ వైపు విభజన హడావుడి జరుగుతోంటే.. ఉప ఎన్నికలు వచ్చేలా కుట్ర చేశాడు.. కౌలు రైతుల కోసం పార్టీ తరపున సాయం చేసిన ఏకైక పార్టీ జనసేనే.. లక్షల కోట్లు.. వేలాది ఎకరాల భూములు.. దేశ విదేశాల్లో ఆస్తులున్న నేతలెవరు చేయని సాయం పవన్ చేశారు.. జనవాణి కార్యక్రమం తర్వాత తమ సభలకు రోగులను పిలిపించుకుని ఆర్ధిక సాయం అని సీఎం జగన్ చెక్కులిస్తున్నారు అని నాదెండ్ల మండిపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!