దీపకాంతులతో అయోధ్య ప్రపంచ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపోత్సవ వేళ అయోధ్య సరికొత్త శోభ సంతరించుకుంది. సరయూనదీ తీరాన 12 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అయోధ్యనగరం అంతటా దీపకాంతులు, లేజర్ షోలతో మిరుమిట్లుగొలిపింది.2021 దీపోత్సవం.సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది సరయూ నదీ తీరం.
అయోధ్యలో దీపోత్సవ 2021 కార్యక్రమం గిన్నీస్ రికార్డులలోకి ఎక్కింది. గతేడాది దీపావళి సమయంలోనూ 5 లక్షల 84 వేల 572 దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది. ఈసారి అయోధ్యలో మొత్తంగా 12 లక్షల దీపాలను వెలిగించారు. ఈ 12 లక్షల దీపాలలో 9 లక్షలు సరయు నది తీరాన ఉన్న రామ్ కీ పైడీ ఘాట్లో వెలిగించారు. మిగిలిన 3 లక్షలు, అయోధ్యలోని వివిధ మఠాల్లో దీప ప్రజ్వలన చేశారు. అయోధ్యలో అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శన నిర్వహించినందుకుగాను ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మరియు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాయి.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన రంగురంగుల లైట్లు మరియు లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. ప్రధానంగా ఆలయ ప్రాంగణాలు లేజర్ షోలతో మిరుమిట్లు గొలిపాయి. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలునిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేడుకలో భాగంగా కళాకారులు అయోధ్యలో రామలీలాను ప్రదర్శించారు. రామ్లీలాను ఆద్యంతం తిలకించారు భక్తజనం. ఆద్యంతం జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య నగరం మార్మోగింది. అంతకుముందు సీతారాముల పాత్రలు ధరించిన కళాకారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్లో లక్నో నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. వరుసగా ఐదో ఏడాది కూడా రామ్కీ పౌడీ ఘాట్లో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్కీ పౌడీ ఘాట్లో దీపాల వెలుగులకు సంబందించి 12 వేల మంది వలంటీర్లు పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!