డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!
- ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్
- సిడ్నీలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డాడు
- బ్రీత్ అనలైజర్ టెస్ట్లో మద్యం సేవించినట్లు నిర్ధారణ
- రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదు – చట్ట పరిమితికి మించి
- మరోబ్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- మే 2026లో కోర్టులో హాజరు కావాలని నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner Arrested: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్స్ లో ఒక్కడైన ‘డేవిడ్ వార్నర్’ చిక్కుల్లో పడ్డారు. సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో ఆడుతున్న వార్నర్, మ్యాచ్ల మధ్య విరామం దొరకడంతో స్వదేశానికి వెళ్లగా.. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Congress vs TMC: బెంగాల్లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
సిడ్నీలోని మరోబ్రా (Maroubra) ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా డేవిడ్ వార్నర్ మద్యం సేవించినట్లుగా తేలింది. వార్నర్ తన కారులో వెళ్తూ బ్రీత్ అనలైజర్ టెస్టింగ్ సైట్ చేరుకోకముందే తన వాహనాన్ని పక్కన నిలిపివేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆయన వాహన దెగ్గరకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రాథమిక పరీక్షలో ఆయన మద్యం సేవించినట్లు తేలడంతో పోలీసులు వార్నర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆ తర్వాత మరోబ్రా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పరీక్షల్లో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి కంటే చాలా ఎక్కువ అని తేలింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి మే 2026లో కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. వచ్చే నెలలో ఈ ఘటనపై కోర్టులో విచారణ జరగనుంది.
Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఈ లీగ్లో ఆయన జట్టు వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. సిడ్నీలో ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఏప్రిల్ 9న కరాచీలో పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ సమయానికి వార్నర్ పాకిస్థాన్ చేరుకుంటారని సమాచారం.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!