Daggubati Purandeswari: అందుకే ప్రధాని మోడీని సీఎం జగన్.. హోంమంత్రి అమిత్షాను చంద్రబాబు కలిశారు..!
Daggubati Purandeswari: ఏపీలో ఎన్నికల పొత్తులపై వాడివేడీగా చర్చలు సాగుతోన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగడం ఆసక్తికరంగా మారింది.. ఈ పర్యటనలో ఏం చర్చలు జరిగాయి అనేది పక్కన పెడ్డితే.. ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కలిశారని.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. అయితే, ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది.. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది.. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు.
మరోవైపు.. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని తెలిపారు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది అని ఆరోపించారు పురంధేశ్వరి.. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది.. నిధుల వినియోగంపై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారని తెలిపారు. మరోవైపు, తిరుపతి ఉప ఎన్నికల్లో వై.సి.పి. నేతలు 35 వేల దొంగ ఓట్లను చేర్చించారని.. దీనిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవెన్యూ.. పోలీస్ అధికారులు నివేదిక ఇచ్చారు.. దీనిపై కూడా విచారణ జరుగుతోందన్నారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఇక, రాష్ట్రంలో లిక్కర్ మాఫియా పేట్రేగిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రహదారులు బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రహదారులను పట్టించుకోవడం లేదన్నారు. సొంత ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది.. అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమా ని ప్రభుత్వం చెల్లించలేదు.. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయి. డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది.. అందుకే 370 ఆర్టికల్ రద్దు.. రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేసిందన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.. ప్యాకేజి బాగుందని కూడా చెప్పారు.. అందుకే అప్పుడు వెంకయ్య నాయుడుకు కూడా సన్మానం చేశారని గుర్తుచేశారు పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!