Biparjoy Cyclone: బిపర్ జోయ్ తుఫాన్ మరో 12 గంటల్లో బలహీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిపర్జోయ్ తుఫాన్ మరో 2 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది. బిపర్జోయ్ తుఫాన్ ఆగ్నేయ పాకిస్థాన్ను ఆనుకొని నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ధోలవీరాకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావంతో కచ్లోని భుజ్లో పలు చెట్లు నేలకూలాయి. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తుంది.
Also Read: BEL Jobs: బీటెక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
అరేబియా సముద్రంలో ఉద్భవించిన బిపర్జోయ్ తుఫాన్ భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని చుట్టుముట్టింది. గురువారం రాత్రి కచ్లోని జఖౌ నౌకాశ్రయానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటింది. అయితే బిపర్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన తర్వాత రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో తుఫాన్ పీడిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వేశాఖ అధికారులు మరికొన్ని రైళ్లను క్యాన్సిల్ చేశారు.
Also Read: Sai Dharam Tej: మామ భోళా శంకర్.. అల్లుడు గంజా శంకర్.. బావుందయ్యా
ఇవాళ (శనివారం) తెల్లవారుజామున గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్లో తుఫాన్ అనంతరం రాష్ట్రంలోని పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహించాలని బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లను గుజరాత్ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Off The Record : టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి వైసీపీ చెక్ పెట్టనుందా..?
తుపాను కారణంగా బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ కారణంగా రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీలోనూ వర్షం కురిసింది. తుఫాన్ అనంతరం రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!