Biparjoy Cyclone: బిపర్ జోయ్ తుఫాన్ మరో 12 గంటల్లో బలహీనం
బిపర్జోయ్ తుఫాన్ మరో 2 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది. బిపర్జోయ్ తుఫాన్ ఆగ్నేయ పాకిస్థాన్ను ఆనుకొని నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ధోలవీరాకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావంతో కచ్లోని భుజ్లో పలు చెట్లు నేలకూలాయి. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తుంది.
Also Read: BEL Jobs: బీటెక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
- Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
అరేబియా సముద్రంలో ఉద్భవించిన బిపర్జోయ్ తుఫాన్ భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని చుట్టుముట్టింది. గురువారం రాత్రి కచ్లోని జఖౌ నౌకాశ్రయానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటింది. అయితే బిపర్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన తర్వాత రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో తుఫాన్ పీడిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వేశాఖ అధికారులు మరికొన్ని రైళ్లను క్యాన్సిల్ చేశారు.
Also Read: Sai Dharam Tej: మామ భోళా శంకర్.. అల్లుడు గంజా శంకర్.. బావుందయ్యా
ఇవాళ (శనివారం) తెల్లవారుజామున గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్లో తుఫాన్ అనంతరం రాష్ట్రంలోని పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహించాలని బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లను గుజరాత్ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Off The Record : టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి వైసీపీ చెక్ పెట్టనుందా..?
తుపాను కారణంగా బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ కారణంగా రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీలోనూ వర్షం కురిసింది. తుఫాన్ అనంతరం రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!