Congress: ఖర్గే ప్రకటించిన CWCలో 50 ఏళ్లలోపు నేతలు ముగ్గురే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులతో సహా మొత్తం 84 మంది ఉన్నారు. అయితే ఖర్గే సీడబ్ల్యూసీ టీమ్లో ఎక్కువగా సీనియర్ నేతలు ఉన్నారు. అయితే యువ నేతలకు అవకాశం ఇవ్వలేదని చెప్పొచ్చు.
BRS : బీఆర్ఎస్ అభ్యర్థులు మారిన స్థానాలు ఇవే
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
CWCలో అత్యంత సీనియర్ గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉండగా.. తక్కువ వయస్సుతో NSUIకి చెందిన నీరజ్ కుందన్ ఉన్నారు. ఉదయ్పూర్లోని చింతన్ క్యాంపులో మరియు రాయ్పూర్ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని స్థాయిలలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు యువతకు ఇస్తామని పేర్కొంది. ’50 అండర్ 50′ ఫార్ములా బ్లాక్ కమిటీ నుండి CWC వరకు జరగాలని కాంగ్రెస్ చెప్పింది. అయితే నిన్న ప్రకటించిన సీడబ్ల్యూసీలో ముగ్గురు మాత్రమే తక్కువ వయస్సు ఉన్న నేతలు ఉన్నారు. మొత్తం 84 మంది సభ్యుల జాబితాలో కేవలం ఒకటిన్నర డజను మంది నాయకులు మాత్రమే 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
Sudigali Sudheer: ఒక విరాట్.. ఒక రాజమౌళి.. ఒక సుడిగాలి సుధీర్.. అదిరిన ‘గోట్’ గ్లింప్స్
సీడబ్ల్యూలోని 39 మంది సభ్యులలో 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న నాయకులలో సచిన్ పైలట్ (46), గౌరవ్ గొగోయ్ (43), కమలేశ్వర్ పటేల్ (49) ఉన్నారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుల్లో కన్హయ్య కుమార్కు 36 ఏళ్లు, దీపేందర్ సింగ్ హుడాకు 45 ఏళ్లు, మాణికం ఠాగూర్కు 48 ఏళ్లు, దేవేంద్ర యాదవ్కు 50 ఏళ్లు, మీనాక్షి నటరాజన్కు 50 ఏళ్లు గలవారు ఉన్నారు. CWC ప్రత్యేక ఆహ్వానితులలో 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న నాయకులకు స్థానం లభించింది. వారిలో NSUI అధ్యక్షుడు నీరజ్ కుందన్ 33 సంవత్సరాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్వినివాస్ బీవీ 41 సంవత్సరాలు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్తె కుమార్ షిండే పరిణీతి షిండే వయస్సు 42 సంవత్సరాలు, సుప్రియా శ్రీనాతే వయస్సు 46 సంవత్సరాలు, అల్కా లాంబా వయస్సు 47 సంవత్సరాలు, నేతా డిసౌజా వయస్సు 48 సంవత్సరాలు, యశోమతి ఠాకూర్ వయస్సు 49 సంవత్సరాలు ఉన్నారు. ఇదిలా ఉంటే మిగిలిన 68 మంది సభ్యులు 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
Health Tips : వీటిని రోజూ రాత్రి తింటే చాలు.. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళతారు..
సీడబ్ల్యూసీలో 50 ఏళ్లు పైబడిన నాయకులు దాదాపు 68 మంది ఉన్నారు. 70 ఏళ్లు పైబడిన నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సీడబ్ల్యూసీలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు 90 ఏళ్లు.. అతను అత్యంత వృద్ధ నేత. అతని తరువాత మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీకి 82 సంవత్సరాలు, మల్లికార్జున్ ఖర్గేకి 81 సంవత్సరాలు ఉన్నాయి.
వీరితో పాటు లాల్ థానేవాల్ 81 సంవత్సరాలు, అంబికా సోనీ 80 సంవత్సరాలు, మీరా కుమార్ 78 సంవత్సరాలు, పి చిదంబరం 77 సంవత్సరాలు, సోనియా గాంధీ 76 సంవత్సరాలు, దిగ్విజయ్ సింగ్ 76 సంవత్సరాలు, హరీష్ రావత్ 75 సంవత్సరాలు, తౌమ్రధ్వాజ్ సాహు 74 సంవత్సరాలు, తారిఖ్ అన్వర్ 72 సంవత్సరాలు మరియు ఆనంద్ శర్మ వయసు 70 ఏళ్లు ఉన్నారు. అంతేకాకుండా CWC యొక్క శాశ్వత ఆహ్వానితులలో మరియు ప్రత్యేక ఆహ్వానితులలో చాలా మంది నాయకుల్లో 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఉన్నారు.
తాజావార్తలు
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!