Cyber Fraud : మారని సైబర్ మోసగాళ్ల తీరు.. టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తూ..
- కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ మోసాలు
- మీ బిల్ పెండింగ్లో ఉంది, డబ్బులు చెల్లించాలని మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు
- ఈరోజు సాయంత్రం లోగా బిల్లు చెల్లించకపోతే మీ ఇంటికి కరెంటు కట్ చేస్తామంటూ బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.
సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తాం” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్లో కొంత మంది లింక్ను జత చేస్తూ, “ఇక్కడ క్లిక్ చేసి తక్షణమే బిల్లు చెల్లించండి” అంటూ చెప్పిన లింక్ను క్లిక్ చేయమంటున్నారు.
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
పరిమిత సమయం ఇచ్చి బెదిరించడం, ఆందోళన కలిగించడం వంటి మార్గాల్లో బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. భయంతో ఆ లింక్ను క్లిక్ చేస్తే, మోసగాళ్లకు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు వెళ్లిపోతాయి. ఈ విధంగా ఖాతాలో ఉన్న డబ్బులను క్షణాల్లో మాయమరిచేలా చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అవినాష్ గణేష్, రోహిత్ కుమార్ వంటి పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఇంకా ఎంతోమంది ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లింకులు క్లిక్ చేయొద్దు: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ వచ్చిన సందేశాల్లోని లింక్ను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి.
అధికారిక సమాచారం పొందండి: మీ కరెంట్ బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి ఎప్పుడూ డిస్కమ్ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించండి.
గూగుల్ సెర్చ్ చేయండి: మీకు సందేహం వస్తే, లింక్ను క్లిక్ చేయకుండా, మీ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారిక వెబ్సైట్ను గూగుల్లో వెతకండి.
అనుమానాస్పద సందేశాలను అంగీకరించొద్దు: మీ ఫోన్కు వచ్చిన అనుమానాస్పద మెసేజ్లను నమ్మకండి. అటువంటి సందేశాలను తక్షణమే డిలీట్ చేయండి.
పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఇలాంటి మోసపూరిత మెసేజ్లు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
తాజావార్తలు
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..