Cyber Fraud : మారని సైబర్ మోసగాళ్ల తీరు.. టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తూ..
- కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ మోసాలు
- మీ బిల్ పెండింగ్లో ఉంది, డబ్బులు చెల్లించాలని మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు
- ఈరోజు సాయంత్రం లోగా బిల్లు చెల్లించకపోతే మీ ఇంటికి కరెంటు కట్ చేస్తామంటూ బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.
సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తాం” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్లో కొంత మంది లింక్ను జత చేస్తూ, “ఇక్కడ క్లిక్ చేసి తక్షణమే బిల్లు చెల్లించండి” అంటూ చెప్పిన లింక్ను క్లిక్ చేయమంటున్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
పరిమిత సమయం ఇచ్చి బెదిరించడం, ఆందోళన కలిగించడం వంటి మార్గాల్లో బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. భయంతో ఆ లింక్ను క్లిక్ చేస్తే, మోసగాళ్లకు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు వెళ్లిపోతాయి. ఈ విధంగా ఖాతాలో ఉన్న డబ్బులను క్షణాల్లో మాయమరిచేలా చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అవినాష్ గణేష్, రోహిత్ కుమార్ వంటి పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఇంకా ఎంతోమంది ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లింకులు క్లిక్ చేయొద్దు: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ వచ్చిన సందేశాల్లోని లింక్ను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి.
అధికారిక సమాచారం పొందండి: మీ కరెంట్ బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి ఎప్పుడూ డిస్కమ్ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించండి.
గూగుల్ సెర్చ్ చేయండి: మీకు సందేహం వస్తే, లింక్ను క్లిక్ చేయకుండా, మీ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారిక వెబ్సైట్ను గూగుల్లో వెతకండి.
అనుమానాస్పద సందేశాలను అంగీకరించొద్దు: మీ ఫోన్కు వచ్చిన అనుమానాస్పద మెసేజ్లను నమ్మకండి. అటువంటి సందేశాలను తక్షణమే డిలీట్ చేయండి.
పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఇలాంటి మోసపూరిత మెసేజ్లు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?