Ambati Rayudu: సీఎం జగన్ను కలిసిన అంబటి రాయుడు.. అందుకు తాను ఆసక్తిగా ఉన్నానని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu: క్రికెట్ అంబటి రాయుడు.. ఏపీ సీఎం వైఎస్ జగ్మోహన్రెడ్డిని కలిశారు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్తో కలిసి వచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు.. సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎం జగన్కు చూపించారు.. దీంతో, సీఎస్కే టీమ్ను అభినందించారు ముఖ్యమంత్రి జగన్..
Read Also: Lucknow Horror:14 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం.. ఆపై సుత్తితో కొట్టి, ఫ్యాన్కు ఉరేసి.. !
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ఇక, ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్కు వివరించారు క్రికెటర్ అంబటి రాయుడు.. అతడి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. సీఎస్కే టీమ్ సభ్యుల ఆటోగ్రాఫ్తో కూడిన జెర్సీని కూడా సీఎం జగన్కు బహుకరించారు రూపా గురునాథ్, అంబటి రాయుడు.. కాగా, ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ సారథ్యం వహించిన సీఎస్కే టీమ్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది.. ఐదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక, ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు అంబటి రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలికాడు.. ట్రోఫీని కూడా అంబటి రాయుడు చేతుల మీదుగా అందుకుంది సీఎస్కే టీమ్.. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో క్రికెటర్ అంబటి రాయుడు సమావేశం కావడం ఇది రెండోసారి.. ఐపీఎల్ ఫైనల్కు ముందు సీఎంను కలిసిన రాయుడు.. ఇప్పుడు కప్ కొట్టిన తర్వాత ఆ కప్ తీసుకొచ్చి కలిశారు.. ఈ భేటీలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. అంబటి రాయుడు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!