Lucknow Horror:14 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం.. ఆపై సుత్తితో కొట్టి, ఫ్యాన్కు ఉరేసి.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Horror: నేటి తరం సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తూ సమాజాన్ని చెడు దారికి మార్గం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంచి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్లో గురువారం ఓ బాలుడు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు గురువారం మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 గంటల మధ్య తక్రోహిలోని బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి సుత్తితో కొట్టి చంపేశాడు. ఇంటి నుండి పారిపోయే ముందు, ఆమె మృతదేహాన్ని ఆమె గదిలో ఫ్యాన్కు ఉరివేసాడు. నిందితుడిని షాహిద్గా గుర్తించారు, అతడికి బాధితురాలితో సంబంధం లేదా హత్యకు గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. బాధితురాలి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం బట్టలు ఇస్త్రీ చేసి, వారి దుకాణానికి వెళ్లిన సమయంలో నిందితుడు వారి ఇంట్లోకి ప్రవేశించి ఈ నేరానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. “నా భార్య ఇంటికి తిరిగి వచ్చి, వరండాలో నిలబడి ఉన్న షాహిద్ను చూసింది, ఆమె అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను తోసివేసి పారిపోయాడు.” అని చెప్పారు. తలకు గాయం కావడంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రూరమైన నేరం స్థానిక సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
Also Read: Viral Video: మేకల మందపై కోతి ఫీట్లు.. బాహుబలి-2 ఫైట్ సీన్ రిపీట్..!
ముంబై సమీపంలోని మీరా రోడ్డులో లైవ్-ఇన్ భాగస్వామి హత్య కేసుపై దేశం ఇప్పటికే షాక్లో ఉన్న రోజునే ఈ దారుణం జరగడం గమనార్హం. ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో తన 32 ఏళ్ల లైవ్-ఇన్ పార్ట్నర్ సరస్వతి వైద్యను హత్య చేసి, రెండు కట్టర్లతో ఆమె శరీరాన్ని 20కి పైగా ముక్కలు చేసి, భాగాలను ఉడకబెట్టినందుకు 56 ఏళ్ల మనోజ్ సానేను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటనను చూసి పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ముంబైకి ఆనుకుని ఉన్న మీరా రోడ్లోని నయానగర్ ప్రాంతానికి చెందినది. నిందితుడు గత 3 సంవత్సరాలుగా మోంజ్ సరస్వతి అనే అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో జీవిస్తున్నాడు. ఈ సంఘటన ఆకాష్దీప్ సొసైటీకి చెందినది. సమాచారం ప్రకారం, కొన్ని రోజుల క్రితం వారిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో విషయం ఎంతగా పెరిగిందంటే మనోజ్ కోపంతో సరస్వతిని చంపేశాడు. దీని తర్వాత, అతను సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఆపై వాటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడు. అయితే హత్య వెనుక అసలు కారణం ఏంటనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం దొరకలేదు.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!