Srinivasa Rao: ఎన్నికల సంఘంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపణలు.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల అక్రమాలను కమిషన్ పట్టించుకోవడం మానేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఎన్నికల సజావుగా జరగా పోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం… బీజేపీ అడ్డుపెట్టుకొన్న తెలుగుదేశం కారణంగానే ఓటరు హక్కుని హరించారన్నారు. పోరాటాలు చేస్తున్న ఇండియా కూటమి పైన కేసులు నమోదు చేశారని తెలిపారు. కోట్ల రూపాయలు చలామణి చేస్తున్న వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు ఫలితాలకు ముందే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే మోడీ ఎన్నికల కమిషన్ ని గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. బూత్ లెవెల్ లో ఓటింగ్ అడిగితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఉందన్నారు.
READ MORE: EVMs: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్లు.. ఈసీ క్లారిటీ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
కాగా.. కేంద్రంలో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తెలిపేలా ఆదేశించాలని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పోలింగ్ వివరాలు ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చూడాలని పేర్కొంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో తారుమారు చేసే పద్ధతులు ఉండకూడదని అభిప్రాయపడింది. సాధారణంగా ఎన్నికల సంఘం పోలింగ్ రోజే సాయంత్రం ఆ రోజు ఎంత శాతం ఓటింగ్ నమోదైందన్న ప్రాథమిక వివరాలు వెల్లడిస్తుంది. కాని కచ్చితమైన వివరాలు వెల్లడించేందుకు సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!