Srinivasa Rao: ఎన్నికల సంఘంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపణలు.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల అక్రమాలను కమిషన్ పట్టించుకోవడం మానేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఎన్నికల సజావుగా జరగా పోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం… బీజేపీ అడ్డుపెట్టుకొన్న తెలుగుదేశం కారణంగానే ఓటరు హక్కుని హరించారన్నారు. పోరాటాలు చేస్తున్న ఇండియా కూటమి పైన కేసులు నమోదు చేశారని తెలిపారు. కోట్ల రూపాయలు చలామణి చేస్తున్న వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు ఫలితాలకు ముందే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే మోడీ ఎన్నికల కమిషన్ ని గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. బూత్ లెవెల్ లో ఓటింగ్ అడిగితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఉందన్నారు.
READ MORE: EVMs: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్లు.. ఈసీ క్లారిటీ
Also Read
కాగా.. కేంద్రంలో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తెలిపేలా ఆదేశించాలని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పోలింగ్ వివరాలు ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చూడాలని పేర్కొంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో తారుమారు చేసే పద్ధతులు ఉండకూడదని అభిప్రాయపడింది. సాధారణంగా ఎన్నికల సంఘం పోలింగ్ రోజే సాయంత్రం ఆ రోజు ఎంత శాతం ఓటింగ్ నమోదైందన్న ప్రాథమిక వివరాలు వెల్లడిస్తుంది. కాని కచ్చితమైన వివరాలు వెల్లడించేందుకు సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!