Prakash Karat : కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత తొమ్మిదేళ్ళలో మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయిందన్నారు. అదానీ, అంబానీల ప్రభుత్వాన్ని కుల్చాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం సహజ వనరులను అదానీ, అంబానిలకు కట్టబెడుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశం చర్చించకుండా వాయిదాలు వేస్తున్నారని, అదానీ అక్రమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారన్నారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని, మోదీ ప్రధాని అయ్యాక అదానీ అస్తి 50వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బడా పెట్టుబడిదారులు సహజ వనరులను శాసిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలపైన పన్నులు వేస్తున్నారు తప్పితే.. సంపన్నులపై పన్నులు వేయడం లేదని, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైన కోత విధించారన్నారు.
Also Read : IPL 2023 : ప్రతి టీమ్ లో ముగ్గురు కొత్త ప్లేయర్స్..
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతవిద్వేషాలు రెచ్చ గొడుతున్నారని, హిందుత్వ ముసుగులో అదానీ, అంబానీ కోసం పని చేస్తూ సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తోందని, లాల్ ప్రసాద్ యాదవ్, కవిత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించిందన్నారు. అంతేకాకుండా.. ‘ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యమని, బీజేపీ..భారతీయ జనతా వాషింగ్ మెషిన్ గా మారిపోయింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై అవినీతి కేసు బిజెపి లో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. మోదీ కార్పొరేట్ విధానాలపై ఉదృతమైన పోరాటాలు నిర్వహించాల్సి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దక్షిణాదిలో తెలంగాణను లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతోంది. వామపక్ష, లౌకిక శక్తులు బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించాలి. బీజేపీ మత చిచ్చు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read : Priyanka Chopra: అమెరికా వెళ్లగానే కళ్ళు కనిపించడం లేదా.. ఆర్ఆర్ఆర్ నే అవమానిస్తావా..?
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!