Prakash Karat : కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత తొమ్మిదేళ్ళలో మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయిందన్నారు. అదానీ, అంబానీల ప్రభుత్వాన్ని కుల్చాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం సహజ వనరులను అదానీ, అంబానిలకు కట్టబెడుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశం చర్చించకుండా వాయిదాలు వేస్తున్నారని, అదానీ అక్రమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారన్నారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని, మోదీ ప్రధాని అయ్యాక అదానీ అస్తి 50వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బడా పెట్టుబడిదారులు సహజ వనరులను శాసిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలపైన పన్నులు వేస్తున్నారు తప్పితే.. సంపన్నులపై పన్నులు వేయడం లేదని, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైన కోత విధించారన్నారు.
Also Read : IPL 2023 : ప్రతి టీమ్ లో ముగ్గురు కొత్త ప్లేయర్స్..
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతవిద్వేషాలు రెచ్చ గొడుతున్నారని, హిందుత్వ ముసుగులో అదానీ, అంబానీ కోసం పని చేస్తూ సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తోందని, లాల్ ప్రసాద్ యాదవ్, కవిత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించిందన్నారు. అంతేకాకుండా.. ‘ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యమని, బీజేపీ..భారతీయ జనతా వాషింగ్ మెషిన్ గా మారిపోయింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై అవినీతి కేసు బిజెపి లో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. మోదీ కార్పొరేట్ విధానాలపై ఉదృతమైన పోరాటాలు నిర్వహించాల్సి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దక్షిణాదిలో తెలంగాణను లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతోంది. వామపక్ష, లౌకిక శక్తులు బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించాలి. బీజేపీ మత చిచ్చు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read : Priyanka Chopra: అమెరికా వెళ్లగానే కళ్ళు కనిపించడం లేదా.. ఆర్ఆర్ఆర్ నే అవమానిస్తావా..?
తాజావార్తలు
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!