CPI Ramakrishna: పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే..
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
- సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం
- పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యతన్న రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప మీరు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి.. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి రూ.33 వేలకోట్ల నిధుల విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ..
Read Also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం విదితమే.. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీసిన విషయం విదితమే. అంతేకాదు.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్న సీఎం.. ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఫైర్ అయ్యారు.. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను అను గుర్తుచేసుకున్నారు.. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!