CPI Ramakrishna: పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే..
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
- సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం
- పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యతన్న రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప మీరు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి.. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి రూ.33 వేలకోట్ల నిధుల విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ..
Read Also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం విదితమే.. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీసిన విషయం విదితమే. అంతేకాదు.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్న సీఎం.. ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఫైర్ అయ్యారు.. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను అను గుర్తుచేసుకున్నారు.. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!