Mangalagiri Lakshmi Narasimha Swamy: వివాదాలకు కేంద్ర బిందువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం
మంగళగిరిలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. ఇప్పుడు ఈ ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన దేవాలయంగా మరియు లక్ష్మీ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం రాజకీయాలకు వేదికగా మారింది, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆనుకొని ఉన్న పెద్ద కోనేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా వార్తల్లో ఉంది. ఈ కోనేరు నుండి నీటిని తీసుకొని స్వామివారికి నిత్యం అభిషేకం చేయడం కోసం పాండవుల కాలంలో ఈ కోనేటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఈ కోనేరు పునర్నిర్మాణం కొరకు వైసీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలు వెచ్చించి మరమ్మత్తులు నిర్వహిస్తుంది, కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ దీని మరమత్తులు చేపట్టారు.
Read Also: Cheetahs: ఈ సారి దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు.. వచ్చేది అప్పుడే?
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
స్థానిక ఎమ్మెల్యే నిత్యం ఈ కోనేరు వద్ద సంచరిస్తున్నారని, కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బినామీ అని, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా నీటిని తోడి, పూడిక తీయాలని నిర్ణయించి ఆ పనులు జరుగుతుండగా, కోనేటి అడుగు భాగంలో గుప్త నిధులు ఉన్నాయని ఒక వర్గం చెబుతుంది. అయితే ఇంత పురాతన కోనేటిని మరమ్మతులు చేసేటప్పుడు సీసీటీవీ తో భద్రత కల్పించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో మరియు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యేని అధికారులని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ డిమాండ్ ను ఎవరు పట్టించుకోలేదు దాంతో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నేతలకు ఉన్న మరియు భక్తులు అనుమానాలను టిడిపి నేతలు వెల్లడించారు.
Read Also: Jagga Reddy : మంత్రి హరీష్రావును కలిసిన జగ్గారెడ్డి..
అయితే తమ ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదని పనులు పారదర్శకంగా జరగడంలేదని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై టిడిపి సీనియర్ నేత పోతినేని శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకి దేవి లు మండిపడ్డారు. ఎంతో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని పలు అనుమానాలకు తావిచ్చే విధంగా అధికారుల తీరు ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు స్పందించి భక్తుల మనోభావాలను గౌరవించాలని పలు ధార్మిక సంస్థలు కూడా కోరుతున్నాయి. అయితే ప్రశ్నించిన వారి గొంతు నొక్కే విధానంలో కేసులు పెడతారని భయంతో కొంతమంది భక్తులు బహిరంగంగా వ్యాఖ్యానించడానికి భయపడుతూ విమర్శలు చేయడం కనపడుతుంది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!