Gujarat Elections 2022: గుజరాత్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక ముస్లిం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Elections 2022: గుజరాత్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్కు చెందిన ఇమ్రాన్ ఖేదావాలా 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ముస్లిం అభ్యర్థి. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం శాసనసభ్యులు ఉన్నారు, అందరూ కాంగ్రెస్కు చెందినవారే కావడం గమనార్హం. అహ్మదాబాద్ నగరంలోని జమాల్పూర్-ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఖేదావాలా గురువారం జరిగిన ఎన్నికల్లో 13,658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా ఆరుగురు ముస్లిం అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపింది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఐదుగురు అభ్యర్థులు ఓడిపోయారు. 2017లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురు అభ్యర్థులలో ముగ్గురు విజయం సాధించారు. గుజరాత్ జనాభాలో దాదాపు 10 శాతం ముస్లింలు ఉన్నారు. అహ్మదాబాద్ జిల్లాలోని దరియాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ బీజేపీకి చెందిన కౌశిక్ జైన్ చేతిలో ఓడిపోయారు. మోర్బి జిల్లాలోని వాంకనేర్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడు మహ్మద్ జావేద్ పిర్జాదా ఓటమిని చవిచూశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
కచ్ జిల్లాలోని అబ్దాసా స్థానంలో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థి జాట్ మమద్ జంగ్ బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రద్యుమన్ సిన్హ్ జడేజా చేతిలో దాదాపు 9,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జమాల్పూర్-ఖాడియా, దరియాపూర్, జంబూసర్ అనే మూడు అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది, అయితే వారిలో ఎవరూ గెలవలేదు. మైనారిటీ వర్గానికి చెందిన 12 మంది ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు, అయితే వారందరూ ఓడిపోయారు. వీరిలో ఇద్దరు ఏఐఎంఐఎం అభ్యర్థులు తమ నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల ముగిసిన ఎన్నికలలో గుజరాత్ చరిత్రలో ఏ పార్టీ కూడా సాధించని విధంగా బీజేపీ 156 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 17 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆప్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!