Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..
- ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది- మల్లు రవి
- కొడంగల్ లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు
- బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు- మల్లు రవి
- ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కొడంగల్లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు.. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారని అన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చూపించాలనే డ్రామాలో భాగంగానే కొడంగల్ ఘటన చేశారు.. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు నిమిష నిమిషానికి ఫోన్లు చేసి, మందు సేవించి కలెక్టర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పై జరిగిన దాడికాదు, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అని అన్నారు.
Jagadguru: ‘‘కాషాయం దేవుడి రంగు’’.. ఖర్గేపై జగద్గురు మండిపాటు..
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
- IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడు హింస మార్గంలో పోరాటం చేయలేదు.. అహింస మార్గంలోనే తాము కేసీఆర్ పై పోరాడామని మల్లు రవి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కుటుంబ సభ్యుల మేలుకే కేసీఆర్ పదేళ్లు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దాడి చేయించి.. కేటీఆర్ ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దలతో అంతకుముందే ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా గతంలో బీజేపీ సహకరించిన విషయాలను గుర్తుచేసి అమృత్ భారత్ స్కాం అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చారన్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి, రేవంత్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేశారని మల్లు రవి తెలిపారు. ఏ ప్రాజెక్టు పనులైన టెండర్లు పిలిచే పనులు అప్పగిస్తారు.. ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ అమృత్ భారత్ పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్తున్నారు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమేనని మల్లు రవి అన్నారు.
IND vs AUS: టీమిండియా ఊపిరి పీల్చుకో.. టీంలోకి వచ్చేస్తున్న స్టార్ బౌలర్
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో సమాధానం చెప్పాలని ఎంపీ మల్లు రవి తెలిపారు. మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకు పోటీకి దూరంగా ఉన్నారు.. ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా శత్రువులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అడ్డుకునేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వ్యవహరిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీనని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ కు లేదు.. బీఆర్ఎస్ హయంలో కలెక్టర్లను, ఎస్పీలను, ప్రభుత్వ ఉద్యోగులను కూలీ వారిలా ట్రీట్ చేశారన్నారు. తాము అధికారుల్లాగా ట్రీట్ చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు బయటపెట్టండి.. అంతేకాని ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలే బీఆర్ఎస్ నేతలకు సరైన గుణపాఠం చెప్తారు.. నిర్మాణాత్మక సూచనలు చేయకుండా దాడులకు పాల్పడటం సరైందికాదని అన్నారు. కొడంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తానే లేఖ రాస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!