Jagadguru: ‘‘కాషాయం దేవుడి రంగు’’.. ఖర్గేపై జగద్గురు మండిపాటు..
- కాషాయం ధరించిన వారు రాజకీయాలు చేయొద్దని ఎక్కడ ఉంది..?
- కాషాయం అంటే భగవంతుడి రంగు..
- మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై జగద్గురు మండిపాటు..
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు.
‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ రాశారు..? శివాజీ కాషాయ పతాకంతో దేశాన్ని మహారాష్ట్రని ఏకం చేశారు. సూట్లు, బూట్లు ధరించిన వారు దేశంలో రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Harish Rao: రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు..
యోగి వ్యాఖ్యలు ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనం అవుతాం) అనే నినాదాన్ని ఉద్దేశిస్తూ ఖర్గే ఇటీవల విమర్శలు గుప్పించారు. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సోమవారం ముంబైలో అన్నారు. ‘‘చాలా మంది నాయకులు సాధువుల వేషధారణలో ఉంటూ ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారారని అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వారు కాషాయ బట్టలు వేసుకుంటారు. తలపై వెంట్రుకలు లేవు. తెల్లబట్టలు వేసుకోవాలి, సన్యాసి అయితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను బీజేపీకి చెబుతా’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. కాషాయం ధరించి ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యోగిపై మండిపడ్డారు.
జగద్గురు రాంభద్రచార్య మాట్లాడుతూ.. యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని సమర్థించారు. మనం విడిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. వర్గాలు వేరైనప్పటికీ హిందువులు అంతా ఒక్కటే అని చెప్పారు. మనం ఒక్కటిగా ఉంటే ఎవరూ హాని చేయలేరని, ఒక్క వేలు బలహీనంగా ఉన్నా, పిడికిలి బలంగా ఉంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!