Jagadguru: ‘‘కాషాయం దేవుడి రంగు’’.. ఖర్గేపై జగద్గురు మండిపాటు..
- కాషాయం ధరించిన వారు రాజకీయాలు చేయొద్దని ఎక్కడ ఉంది..?
- కాషాయం అంటే భగవంతుడి రంగు..
- మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై జగద్గురు మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు.
‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ రాశారు..? శివాజీ కాషాయ పతాకంతో దేశాన్ని మహారాష్ట్రని ఏకం చేశారు. సూట్లు, బూట్లు ధరించిన వారు దేశంలో రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు.
Also Read
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
Read Also: Harish Rao: రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు..
యోగి వ్యాఖ్యలు ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనం అవుతాం) అనే నినాదాన్ని ఉద్దేశిస్తూ ఖర్గే ఇటీవల విమర్శలు గుప్పించారు. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సోమవారం ముంబైలో అన్నారు. ‘‘చాలా మంది నాయకులు సాధువుల వేషధారణలో ఉంటూ ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారారని అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వారు కాషాయ బట్టలు వేసుకుంటారు. తలపై వెంట్రుకలు లేవు. తెల్లబట్టలు వేసుకోవాలి, సన్యాసి అయితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను బీజేపీకి చెబుతా’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. కాషాయం ధరించి ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యోగిపై మండిపడ్డారు.
జగద్గురు రాంభద్రచార్య మాట్లాడుతూ.. యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని సమర్థించారు. మనం విడిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. వర్గాలు వేరైనప్పటికీ హిందువులు అంతా ఒక్కటే అని చెప్పారు. మనం ఒక్కటిగా ఉంటే ఎవరూ హాని చేయలేరని, ఒక్క వేలు బలహీనంగా ఉన్నా, పిడికిలి బలంగా ఉంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..