Podem Veeraya: రేగాకాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య విరుచుకుపడ్డారు. తనని దసరా బుల్లోడు సంక్రాంతి గంగిరెద్దుగా అభివర్ణించడంతో పరుష పదజాలంతో ప్రశ్నించారు. రేగా కాంతారావు నువ్వు గెలిచింది ఎక్కడా.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బులకి అమ్ముడుపోయిన నువ్వా నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలని అన్నారు. భద్రాచలానికి నువ్వు కానీ, నీ ముఖ్యమంత్రి గాని, నీ పార్టీ గాని ఏం చేశారని ప్రశ్నించారు. ఐదు పంచాయతీల విషయంలో ఏం పోరాడారని దుయ్యబట్టారు.
IND vs PAK: భారత్ లక్ష్యం 192.. విజృంభించిన టీమిండియా బౌలర్లు
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రివైనా నువ్వు కేవలం నీ నియోజకవర్గానికి మాత్రమే నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకుంటున్నారని వీరయ్య ఆరోపించారు. భద్రాచలం గాలికి వదిలేసిన మీరు ఏ మొహం పెట్టుకొని భద్రాచలం వస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెల్లం వెంకటరమణ ప్రశ్నిస్తూ.. గత ఎన్నికల్లో ఓడిపోయిన మీరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిని కలిసి నిధులు ఏమైనా అడిగారా అని ప్రశ్నించారు.
PM Modi: నవరాత్రి వేళ ప్రధాని రాసిన “గర్భా” సాంగ్.. యూట్యూబ్లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న వీడియో..
రేగా కాంతారావు ఏమాత్రం సిగ్గు లేకుండా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని పోదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని.. రేపు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. అప్పుడు నీ అక్రమ సంపాదన, భూదందాల సంగతి చూస్తామని తెలిపారు. తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనని, చచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే.. రోజుకొక పార్టీ కండువా మార్చే మీరా నన్ను విమర్శించేది అని దుయ్యబట్టారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా నాయకుడుగా నిలబడింది తాను మాత్రమేనని పోదెం వీరయ్య అన్నారు. కేసీఆర్ డబ్బులకి కక్కుర్తి పడి పార్టీ మారింది రేగా కాంతారావు, రోజుకు ఒక పార్టీ మారే వ్యక్తి తెల్ల వెంకట్రావు.. వీరు నన్ను ఓడిస్తారా వాళ్లకి డబ్బుంటే నాకు ప్రజాబలం ఉందని పోదెం వీరయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!