Bandi Ramesh: కాంగ్రెస్ను గెలిపిద్దాం.. అభివృద్ధిని సాధిద్దాం
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు. ఈ క్రమంలో బండి రమేష్.. కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూసి జనం చప్పట్లు కొట్టి అభినందించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయని బీఆర్ఎస్ పాలన అవసరమా అంటూ బండి రమేషన్ ప్రజలను అడిగారు.
Read Also: 3 Trains on One Track: వందేభారత్కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్పై మూడు రైళ్లు
Also Read
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Astrology: మే 5th మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననడం, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనే బంగారమని, కేసీఆర్ బంగారు తెలంగాణ పాలన బూటకమని తేలిపోయిందన్నారు. మాధవరం కృష్ణారావు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని పట్టుదలగా ఉన్నారని బండి రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్ పాలన వస్తేనే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. రూ 500కే గ్యాస్ సిలిండర్, పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు, 18 ఏళ్లు నిండి చదువుకునే యువకులకు ఎలక్ట్రిక్ స్కూటీ, రైతుబంధు సాలుకు రూ.15 వేలకు పెంపు, కౌలు రైతులకు కూడా వర్తింపు, రైతన్నలకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, సబ్సిడిపై సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా వంటి ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు కలుగుతాయన్నారు.
నిజమైన అభివృద్ధి కావాలంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని బండి రమేష్ ప్రజలను కోరారు. పార్టీని గెలిపించి ప్రజలకు మేలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ డాక్టర్ సత్యం శ్రీరంగం, సీనియర్ నాయకులు గొట్టు ముక్కల వెంకటేశ్వరావు, నాగరాజు, మహిళా నాయకులు రమాదేవి, సరోజిని, కవిత రమేష్, మధు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
-
Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
-
EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!