Bandi Ramesh: కాంగ్రెస్ను గెలిపిద్దాం.. అభివృద్ధిని సాధిద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు. ఈ క్రమంలో బండి రమేష్.. కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూసి జనం చప్పట్లు కొట్టి అభినందించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయని బీఆర్ఎస్ పాలన అవసరమా అంటూ బండి రమేషన్ ప్రజలను అడిగారు.
Read Also: 3 Trains on One Track: వందేభారత్కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్పై మూడు రైళ్లు
Also Read
- RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
- Sriman: "నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు".. నటుడు ఆవేదన!
- Crispy Jalebi Recipe: ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతం!
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననడం, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనే బంగారమని, కేసీఆర్ బంగారు తెలంగాణ పాలన బూటకమని తేలిపోయిందన్నారు. మాధవరం కృష్ణారావు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని పట్టుదలగా ఉన్నారని బండి రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్ పాలన వస్తేనే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. రూ 500కే గ్యాస్ సిలిండర్, పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు, 18 ఏళ్లు నిండి చదువుకునే యువకులకు ఎలక్ట్రిక్ స్కూటీ, రైతుబంధు సాలుకు రూ.15 వేలకు పెంపు, కౌలు రైతులకు కూడా వర్తింపు, రైతన్నలకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, సబ్సిడిపై సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా వంటి ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు కలుగుతాయన్నారు.
నిజమైన అభివృద్ధి కావాలంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని బండి రమేష్ ప్రజలను కోరారు. పార్టీని గెలిపించి ప్రజలకు మేలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ డాక్టర్ సత్యం శ్రీరంగం, సీనియర్ నాయకులు గొట్టు ముక్కల వెంకటేశ్వరావు, నాగరాజు, మహిళా నాయకులు రమాదేవి, సరోజిని, కవిత రమేష్, మధు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ.. ఎవరూ ఊహించని హీరో?.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో