కాంగ్రెస్ నాయకత్వం.. దక్షిణానికి దండం పెట్టేస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు పూర్తిగా కరగదీసుకుంది కాంగ్రెస్. అక్కడ.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్ధండులు ఉన్నా.. ఏ మాత్రం ఫలితం లేకుండా పోతోంది. కనీసం బలం పుంజుకుంటుందా.. లేదా.. అన్నది కూడా ఆ పార్టీలో సందేహాస్పదంగా కనిపిస్తోంది. బీజేపీకి కేంద్రం నుంచి ఉన్న బలం, రాష్ట్రంలో పట్టు పెరగడం.. వాటిని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహం లేకపోవడం.. ఈ పరిస్థితికి కారణమైంది.
తెలుగు రాష్ట్రాల సంగతి. తెలంగాణ ఇచ్చిన పేరున్నా కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నా.. అడ్డు తగులుతున్న నేతలు.. సహాయ నిరాకరణ చేస్తున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. అందుకే.. రేవంత్ సభలకు జనాలు వస్తున్నా.. అగ్ర నేతలు రాకపోతుండడం.. పార్టీలో పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తెల్లారే.. కాంగ్రెస్ ను ప్రజలు వదిలేసుకున్నారని చెప్పొచ్చు. తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కరంటే ఒక్కరిని గెలిపించుకోలేని స్థితికి పార్టీ దిగజారింది. నాయకత్వ లోపాలు, శ్రేణుల్లో సన్నగిల్లిన స్థైర్యం, విభజన ముద్ర.. ఇవన్నీ పార్టీని జనానికి దూరం చేశాయి. జాతీయ నాయకత్వం సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడం.. ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయకపోవడం.. ఇందుకు కారణమైంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
తమిళనాడు.. కేరళ సంగతి.. కాంగ్రెస్ రాజకీయ ఉద్ధండులకు కేరాఫ్ ఈ రాష్ట్రాలు. స్వయానా అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కేరళలోని వయనాడ్ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిదంబరం వంటి వ్యూహకర్తలు తమిళనాడు నుంచి ఉన్నారు. అయినా.. గతంలోని స్ఫూర్తిని, రాజకీయ వ్యూహాలను ఆ పార్టీ రచించలేకపోతోంది. ఓవరాల్ గా.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా.. కాంగ్రెస్ భవిష్యత్తుపై అనుమానపు మేఘాలే కమ్ముకుపోతున్నాయి. ఇదే.. పార్టీ శ్రేణుల్లో అంతర్మథనానికి దారి తీస్తూ.. మరో పార్టీవైపు చూసేలా చేస్తోంది. కాంగ్రెస్ కు మాత్రమే సొంతమైన రాజకీయ చతురతపై అభిమానం ఉన్న వాళ్లకు.. ఆవేదనను మిగులుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!