కాంగ్రెస్ నాయకత్వం.. దక్షిణానికి దండం పెట్టేస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు పూర్తిగా కరగదీసుకుంది కాంగ్రెస్. అక్కడ.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్ధండులు ఉన్నా.. ఏ మాత్రం ఫలితం లేకుండా పోతోంది. కనీసం బలం పుంజుకుంటుందా.. లేదా.. అన్నది కూడా ఆ పార్టీలో సందేహాస్పదంగా కనిపిస్తోంది. బీజేపీకి కేంద్రం నుంచి ఉన్న బలం, రాష్ట్రంలో పట్టు పెరగడం.. వాటిని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహం లేకపోవడం.. ఈ పరిస్థితికి కారణమైంది.
తెలుగు రాష్ట్రాల సంగతి. తెలంగాణ ఇచ్చిన పేరున్నా కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నా.. అడ్డు తగులుతున్న నేతలు.. సహాయ నిరాకరణ చేస్తున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. అందుకే.. రేవంత్ సభలకు జనాలు వస్తున్నా.. అగ్ర నేతలు రాకపోతుండడం.. పార్టీలో పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తెల్లారే.. కాంగ్రెస్ ను ప్రజలు వదిలేసుకున్నారని చెప్పొచ్చు. తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కరంటే ఒక్కరిని గెలిపించుకోలేని స్థితికి పార్టీ దిగజారింది. నాయకత్వ లోపాలు, శ్రేణుల్లో సన్నగిల్లిన స్థైర్యం, విభజన ముద్ర.. ఇవన్నీ పార్టీని జనానికి దూరం చేశాయి. జాతీయ నాయకత్వం సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడం.. ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయకపోవడం.. ఇందుకు కారణమైంది.
Also Read
- How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
- ఇక సెలవు.. నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
- ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
- Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!
తమిళనాడు.. కేరళ సంగతి.. కాంగ్రెస్ రాజకీయ ఉద్ధండులకు కేరాఫ్ ఈ రాష్ట్రాలు. స్వయానా అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కేరళలోని వయనాడ్ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిదంబరం వంటి వ్యూహకర్తలు తమిళనాడు నుంచి ఉన్నారు. అయినా.. గతంలోని స్ఫూర్తిని, రాజకీయ వ్యూహాలను ఆ పార్టీ రచించలేకపోతోంది. ఓవరాల్ గా.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా.. కాంగ్రెస్ భవిష్యత్తుపై అనుమానపు మేఘాలే కమ్ముకుపోతున్నాయి. ఇదే.. పార్టీ శ్రేణుల్లో అంతర్మథనానికి దారి తీస్తూ.. మరో పార్టీవైపు చూసేలా చేస్తోంది. కాంగ్రెస్ కు మాత్రమే సొంతమైన రాజకీయ చతురతపై అభిమానం ఉన్న వాళ్లకు.. ఆవేదనను మిగులుస్తోంది.
తాజావార్తలు
-
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
-
Vivo Y500: వివో Y500 విడుదల.. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో కొత్త స్మార్ట్ఫోన్
-
How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
-
Rao Bahadur: ‘నేను ఎప్పుడూ సహజీవనం చేస్తుంటాను’.. ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాటల తూటాలు!
-
ఇక సెలవు.. నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!