కాంగ్రెస్ నాయకత్వం.. దక్షిణానికి దండం పెట్టేస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు పూర్తిగా కరగదీసుకుంది కాంగ్రెస్. అక్కడ.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్ధండులు ఉన్నా.. ఏ మాత్రం ఫలితం లేకుండా పోతోంది. కనీసం బలం పుంజుకుంటుందా.. లేదా.. అన్నది కూడా ఆ పార్టీలో సందేహాస్పదంగా కనిపిస్తోంది. బీజేపీకి కేంద్రం నుంచి ఉన్న బలం, రాష్ట్రంలో పట్టు పెరగడం.. వాటిని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహం లేకపోవడం.. ఈ పరిస్థితికి కారణమైంది.
తెలుగు రాష్ట్రాల సంగతి. తెలంగాణ ఇచ్చిన పేరున్నా కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నా.. అడ్డు తగులుతున్న నేతలు.. సహాయ నిరాకరణ చేస్తున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. అందుకే.. రేవంత్ సభలకు జనాలు వస్తున్నా.. అగ్ర నేతలు రాకపోతుండడం.. పార్టీలో పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తెల్లారే.. కాంగ్రెస్ ను ప్రజలు వదిలేసుకున్నారని చెప్పొచ్చు. తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కరంటే ఒక్కరిని గెలిపించుకోలేని స్థితికి పార్టీ దిగజారింది. నాయకత్వ లోపాలు, శ్రేణుల్లో సన్నగిల్లిన స్థైర్యం, విభజన ముద్ర.. ఇవన్నీ పార్టీని జనానికి దూరం చేశాయి. జాతీయ నాయకత్వం సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడం.. ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయకపోవడం.. ఇందుకు కారణమైంది.
Also Read
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- Special Trains: పండుగ సీజ్లో రైల్వేశాఖ గుడ్న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
- BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
తమిళనాడు.. కేరళ సంగతి.. కాంగ్రెస్ రాజకీయ ఉద్ధండులకు కేరాఫ్ ఈ రాష్ట్రాలు. స్వయానా అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కేరళలోని వయనాడ్ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిదంబరం వంటి వ్యూహకర్తలు తమిళనాడు నుంచి ఉన్నారు. అయినా.. గతంలోని స్ఫూర్తిని, రాజకీయ వ్యూహాలను ఆ పార్టీ రచించలేకపోతోంది. ఓవరాల్ గా.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా.. కాంగ్రెస్ భవిష్యత్తుపై అనుమానపు మేఘాలే కమ్ముకుపోతున్నాయి. ఇదే.. పార్టీ శ్రేణుల్లో అంతర్మథనానికి దారి తీస్తూ.. మరో పార్టీవైపు చూసేలా చేస్తోంది. కాంగ్రెస్ కు మాత్రమే సొంతమైన రాజకీయ చతురతపై అభిమానం ఉన్న వాళ్లకు.. ఆవేదనను మిగులుస్తోంది.
తాజావార్తలు
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
Special Trains: పండుగ సీజ్లో రైల్వేశాఖ గుడ్న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!