Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?
- 8 నెలల కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రుణాలు మాఫీ కాలేదా?
- రేవంత్ హయాంలో అసెంబ్లీ హుందాగా నడుస్తోంది
- మూసీ ప్రక్షాళన చేయాలా..వద్దా?
- మీడియా సమావేశంలో జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారని.. ఈ 8 నెలల కాలంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి..రేవంత్ సీఎం అయ్యాకా ఎలా నడుస్తున్నాయో చూడాలన్నారు. గతంలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్లను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఈ 8 నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయన్నారు. రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నడుస్తున్నాయని వెల్లడించారు. కేసీఆర్ ఒక్కసారి సభకు వచ్చారని ఆయన చెప్పారు. హరీశ్, కేటీఆర్లు అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం సభలో మాట్లాడారని వెల్లడించారు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నా నిందలు వేస్తున్నారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నిందలు వేయడం తప్పా బీఆర్ఎస్కు ఏం తెలియదని విమర్శించారు. బీజేపీ నేతలు కూడా మాటలు మాట్లాడటమే తప్పా చేతలు లేవని వ్యాఖ్యానించారు.
Read Also: CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
మూసీని సుందరీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. మూసీ ప్రక్షాళన డబ్బుల కోసమేనని బీజేపీ నేతలు అంటున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. చేస్తే డబ్బుల కోసం అంటారు..చేయకపోతే చేయడం లేదు అంటారని.. మరి ఏం చేయాలంటూ ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి స్పష్టత ఉందా.. లేదా? మూసీ ప్రక్షాళన చేయొద్దు అని తీర్మానం చేసి చెప్పాలంటూ పేర్కొన్నారు. అంతే కానీ అభాండాలు వేయొద్దన్నారు. గంగా ప్రక్షాళనలో మోడీ అవినీతి కోసం చేస్తున్నారా అంటూ జగ్గారెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సెక్రటేరియట్ అంతా కళకళలాడుతుందన్నారు. సెక్రటేరియట్లో అసలు పార్కింగ్కి జాగా సరిపోవడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా లేను కానీ, సమస్యలను మంత్రులు చెప్తే రెస్పాండ్ అయ్యి చేస్తు్న్నారని తెలిపారు. సమస్యలు వినే వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బురద జల్లే పని పెట్టుకున్నారని విమర్శించారు.
ముచ్చెర్లలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారని.. దాని గురించి ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబులు అమెరికాలో పెట్టుబడుల కోసం వెళ్లారని తెలిపారు. బీజేపీ నేతలు కోతల రాయుళ్లు అని.. బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లకు పౌరుషం ఉంటే ఐటీఐఆర్ మంజూరు చేయించాలన్నారు.
- Tags
- bjp
- BRS
- congress
- jagga reddy
- latest news
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!