Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Congress Leader Jagga Reddy Fires On Bjp And Brs

Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?

Published Date :August 6, 2024 , 5:17 pm
By Mahesh Jakki
  • 8 నెలల కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రుణాలు మాఫీ కాలేదా?
  • రేవంత్ హయాంలో అసెంబ్లీ హుందాగా నడుస్తోంది
  • మూసీ ప్రక్షాళన చేయాలా..వద్దా?
  • మీడియా సమావేశంలో జగ్గారెడ్డి
Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagga Reddy: తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారని.. ఈ 8 నెలల కాలంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి..రేవంత్ సీఎం అయ్యాకా ఎలా నడుస్తున్నాయో చూడాలన్నారు. గతంలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్‌లను సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. ఈ 8 నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయన్నారు. రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నడుస్తున్నాయని వెల్లడించారు. కేసీఆర్‌ ఒక్కసారి సభకు వచ్చారని ఆయన చెప్పారు. హరీశ్‌, కేటీఆర్‌లు అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం సభలో మాట్లాడారని వెల్లడించారు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నా నిందలు వేస్తున్నారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నిందలు వేయడం తప్పా బీఆర్‌ఎస్‌కు ఏం తెలియదని విమర్శించారు. బీజేపీ నేతలు కూడా మాటలు మాట్లాడటమే తప్పా చేతలు లేవని వ్యాఖ్యానించారు.

Read Also: CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..

Also Read

  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..
  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..

మూసీని సుందరీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. మూసీ ప్రక్షాళన డబ్బుల కోసమేనని బీజేపీ నేతలు అంటున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. చేస్తే డబ్బుల కోసం అంటారు..చేయకపోతే చేయడం లేదు అంటారని.. మరి ఏం చేయాలంటూ ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి స్పష్టత ఉందా.. లేదా? మూసీ ప్రక్షాళన చేయొద్దు అని తీర్మానం చేసి చెప్పాలంటూ పేర్కొన్నారు. అంతే కానీ అభాండాలు వేయొద్దన్నారు. గంగా ప్రక్షాళనలో మోడీ అవినీతి కోసం చేస్తున్నారా అంటూ జగ్గారెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సెక్రటేరియట్ అంతా కళకళలాడుతుందన్నారు. సెక్రటేరియట్‌లో అసలు పార్కింగ్‌కి జాగా సరిపోవడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా లేను కానీ, సమస్యలను మంత్రులు చెప్తే రెస్పాండ్ అయ్యి చేస్తు్న్నారని తెలిపారు. సమస్యలు వినే వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు బురద జల్లే పని పెట్టుకున్నారని విమర్శించారు.

ముచ్చెర్లలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారని.. దాని గురించి ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులు అమెరికాలో పెట్టుబడుల కోసం వెళ్లారని తెలిపారు. బీజేపీ నేతలు కోతల రాయుళ్లు అని.. బీజేపీ మంత్రులు కిషన్‌ రెడ్డి, సంజయ్‌లకు పౌరుషం ఉంటే ఐటీఐఆర్‌ మంజూరు చేయించాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • congress
  • jagga reddy
  • latest news

తాజావార్తలు

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

  • Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!

  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!

  • IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions