Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?
- 8 నెలల కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రుణాలు మాఫీ కాలేదా?
- రేవంత్ హయాంలో అసెంబ్లీ హుందాగా నడుస్తోంది
- మూసీ ప్రక్షాళన చేయాలా..వద్దా?
- మీడియా సమావేశంలో జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారని.. ఈ 8 నెలల కాలంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి..రేవంత్ సీఎం అయ్యాకా ఎలా నడుస్తున్నాయో చూడాలన్నారు. గతంలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్లను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఈ 8 నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయన్నారు. రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నడుస్తున్నాయని వెల్లడించారు. కేసీఆర్ ఒక్కసారి సభకు వచ్చారని ఆయన చెప్పారు. హరీశ్, కేటీఆర్లు అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం సభలో మాట్లాడారని వెల్లడించారు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నా నిందలు వేస్తున్నారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నిందలు వేయడం తప్పా బీఆర్ఎస్కు ఏం తెలియదని విమర్శించారు. బీజేపీ నేతలు కూడా మాటలు మాట్లాడటమే తప్పా చేతలు లేవని వ్యాఖ్యానించారు.
Read Also: CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..
Also Read
మూసీని సుందరీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. మూసీ ప్రక్షాళన డబ్బుల కోసమేనని బీజేపీ నేతలు అంటున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. చేస్తే డబ్బుల కోసం అంటారు..చేయకపోతే చేయడం లేదు అంటారని.. మరి ఏం చేయాలంటూ ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి స్పష్టత ఉందా.. లేదా? మూసీ ప్రక్షాళన చేయొద్దు అని తీర్మానం చేసి చెప్పాలంటూ పేర్కొన్నారు. అంతే కానీ అభాండాలు వేయొద్దన్నారు. గంగా ప్రక్షాళనలో మోడీ అవినీతి కోసం చేస్తున్నారా అంటూ జగ్గారెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సెక్రటేరియట్ అంతా కళకళలాడుతుందన్నారు. సెక్రటేరియట్లో అసలు పార్కింగ్కి జాగా సరిపోవడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా లేను కానీ, సమస్యలను మంత్రులు చెప్తే రెస్పాండ్ అయ్యి చేస్తు్న్నారని తెలిపారు. సమస్యలు వినే వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బురద జల్లే పని పెట్టుకున్నారని విమర్శించారు.
ముచ్చెర్లలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారని.. దాని గురించి ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబులు అమెరికాలో పెట్టుబడుల కోసం వెళ్లారని తెలిపారు. బీజేపీ నేతలు కోతల రాయుళ్లు అని.. బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లకు పౌరుషం ఉంటే ఐటీఐఆర్ మంజూరు చేయించాలన్నారు.
- Tags
- bjp
- BRS
- congress
- jagga reddy
- latest news
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!