Pune Porsche accident: పోర్షే కార్ యాక్సిడెంట్ కేసులో జస్టిస్ బోర్డు ఆదేశాలపై కాంగ్రెస్ వినూత్న నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి తండ్రి ఓ ప్రముఖ బిల్డర్ కావడంతో పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో వ్యాస రచన పోటీని నిర్వహించింది. ‘ఒకవేళ మా నాన్న బిల్డర్ అయితే?’, ‘ఆల్కహాల్ వల్ల కలిగే దుష్పరిణామాలు’ ‘అధికార వ్యవస్థ నిద్ర పోతోందా?’ వంటి అంశాలపై వ్యాస రచన పోటీ నిర్వహించింది.
READ MORE: Anjali Bhaskar: బస్సులో నన్ను అక్కడ తాకాడు.. ఒక్కరు కూడా ఏమనలేదు.. నటి షాకింగ్ కామెంట్స్!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఆదివారం నిర్వహించిన ఈ పోటీకి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆకట్టుకునేలా వ్యాసం రాసిన వారికి రూ.11వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు చొప్పున బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపరు. ఈ వ్యాసాలను పూణే పోలీసుల కమిషనరుకు పంపుతామని తెలిపారు. మే 19న జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కేవలం 15 గంటల్లోనే బాలుడికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరుచేసిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఈ రూపంలో నిరసన తెలియజేసింది. వరైనా యాక్సిడెంట్ చేస్తే వారి కుటుంబ సంబంధాలను దృష్టిలోపెట్టుకుని ఇలానే 300 పదాలు, 600 పదాల వ్యాసం రాయిస్తారా? అని పుణె కాంగ్రెస్ నేత సంగీత తివారీ ప్రశ్నించారు.
కాగా.. పూణె నగరంలో మే 18-19 మధ్య రాత్రి, 17 ఏళ్ల బాలుడు మూడు కోట్ల రూపాయల విలువైన పోర్షే కారును అతి వేగంతో నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. వాహనం ఢీకొనడంతో బైక్ బ్యాలెన్స్ తప్పి చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించగా, నిందితుడు మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన 14 గంటల తర్వాత, నిందితుడు మైనర్ కొన్ని షరతులతో కోర్టు నుండి బెయిల్ పొందాడు. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని, రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, పరిష్కారాలపై 300 పదాల వ్యాసాన్ని రాయాలని కోర్టు ఆదేశించింది. తర్వాత వివాదం ముదిరిపోవడంతో కోర్టు అతడి బెయిల్ను రద్దు చేసింది. అనంతరం జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోంకు తరలించారు. దీంతో పాటు ఈ కేసులో మైనర్ తండ్రి, తాతలను కూడా అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!