Himachal Pradesh CM: హిమాచల్ తదుపరి సీఎంపై నేడు కీలక నిర్ణయం.. ఎక్కువ ఛాన్స్ వారికే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh CM: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి శుక్రవారం సిమ్లాలో సమావేశం కానున్నారు. హిమాచల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్లో జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లా, పరిశీలకులు భూపేష్ బఘేల్, భూపేంద్ర హుడా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పార్టీ హైకమాండ్కు ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు పేరును వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఎంపిక చేయనుంది. హిమాచల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్, ముందుగా చండీగఢ్లో తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ప్లాన్ చేసింది. అయితే స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత తన ప్రణాళికలను మార్చుకుంది. ప్రతిభా సింగ్తో సహా వివిధ ఆశావహుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం కాంగ్రెస్కు పెద్ద పని. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖూ, సీఎల్పీ నేత ముఖేష్ అగ్నిహోత్రి కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ చీఫ్ నిర్ణయిస్తారని అంతకుముందు గురువారం రాజీవ్ శుక్లా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రాష్ట్రంలో 10 హామీలను అమలు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లా అన్నారు. హిమాచల్ప్రదేశ్లో గురువారం నాడు ప్రకటించిన ఫలితాల్లో ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో అధికార పార్టీపై వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది.
Also Read
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
Cyclone Mandous: దూసుకొస్తున్న మాండూస్ తుఫాను.. తమిళనాడులో రెస్క్యూ బృందాలు మోహరింపు
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించగా, ఆప్ రాష్ట్రంలో తన ఖాతా తెరవలేకపోయింది. హిమాచల్లో ఓట్ల శాతం ప్రకారం, కాంగ్రెస్ తన ప్రత్యర్థికి 42.99 శాతం ఓట్లతో పోలిస్తే 43.88 శాతం ఓట్లతో బీజేపీ కంటే స్వల్పంగా మాత్రమే ముందంజలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను మార్చే సుదీర్ఘ సంప్రదాయాన్ని కలిగి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?