Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్ ప్రమాదంపై చీఫ్ సెక్రటరీ నివేదిక.. షాకింగ్ విషయాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఇన్స్టిట్యూట్లోనే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మూసివేశారని తేలింది. ఇన్స్టిట్యూట్లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు లేవనే వాస్తవాన్ని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక కూడా వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. కోచింగ్ ఇన్స్టిట్యూట్ డ్రైనేజీ కాలువను పై నుండి కప్పింది. ఇన్స్టిట్యూట్ పార్కింగ్ స్థలం నేరుగా రహదారికి ఆనుకొని ఉంటుంది. దీంతో భారీ వర్షం వచ్చినప్పుడు, రహదారిపై వచ్చే నీరు డ్రైన్లోకి వెళ్లకుండా నేరుగా పార్కింగ్ స్థలంలోకి వెళ్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. సిబ్బంది ఉంటే నీరు వదిలించే విషయంలో అప్రమత్తంగా ఉండి విద్యార్థుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది. భవనం వెలుపల ఉన్న రహదారిపై ఆక్రమణలు, అక్రమ ర్యాంప్ కారణంగా వర్షపు నీరు కాలువలలోకి వెళ్లలేకపోయిందని నివేదిక ఎంసీడీ పై ప్రశ్నలను లేవనెత్తింది.
లైబ్రరీల ఫీజులు రెట్టింపు
పాత రాజేంద్ర నగర్, పరిసర ప్రాంతాల్లోని లైబ్రరీలు ఇప్పుడు ఫీజులను రెట్టింపు చేశాయని సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న విద్యార్థులు పేర్కొన్నారు. ఇంతకుముందు రూ.2000 ఫీజు ఉన్న చోట ఇప్పుడు నెలకు రూ.4 నుంచి 5 వేలు అడుగుతున్నారు.
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
Read Also:Niharika: నిహారిక సినిమాకు అదిరే ఆఫర్.. థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్..
ఢిల్లీ ప్రభుత్వం, కార్పొరేషన్ కమిషనర్కు NHRC నోటీసు
రావు కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని సుమోటోగా గుర్తించి, రెండు వారాల్లోగా ఒక వివరణాత్మక నివేదికను సమర్పించాలని కమిషన్ వారిని కోరింది. ఇందులో సంస్థలపై పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, సంబంధిత శాఖలు తీసుకున్న చర్యల వివరాలు కూడా ఉంటాయి.
ఈరోజు హైకోర్టులో విచారణ
ఈ కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ దాఖలైన పిల్ను బుధవారం ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషారరావు ధర్మాసనం విచారించనుంది. కుటుంబ్ అనే సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలను పిటిషన్లో పార్టీలుగా చేర్చారు.
Read Also:Realme 13 Pro Series: ఏఐ కెమెరా ఫీచర్తో రియల్మీస్మార్ట్ఫోన్స్.. ధర, బ్యాటరీ డీటెయిల్స్ ఇవే!
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!