CM Jagan: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాద ఘటన.. మత్స్యకారులకు ఏపీ సర్కార్ భారీ సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ఈ ఉదయం జరిగిన సమావేశంలో సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
Read Also: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని
Also Read
కాగా, ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు సహా జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి భరోసానిచ్చామని వివరించారు. ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మట్లాడుతూ.. ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ అని.. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెటాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సహాయం విషయంలో అత్యంత మానవతాధృక్ఫధంతో వ్యవహరించాలన్నారు. మానవత్వం అనే పదానికి అర్ధం చెబుతూ.. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా ఈ సాయం ఉండాలని సీఎం చెప్పారు. అందుకే ఈ విషయంలో ఉదారంగా ఉండాలని ఆదేశించారు.
Read Also: Tammineni Sitaram: చంద్రబాబు దొరికిన కాడికి దోచుకున్నారు..
దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మత్స్యకారుల తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకునేలా అండగా ఉండాలన్నారు. బోట్లకు బీమా లేదనో, లేక మరో సాంకేతిక కారణాలనో చూపి వారి జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు అని ఆయన చెప్పారు. ఇలాంటి కష్టం కాలంలోనే వారికి పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలని జగన్ అన్నారు.
Read Also: Tragedy: సాంబార్ గిన్నెలో పడి రెండో తరగతి బాలిక మృతి
ఇక, ప్రాథమిక అంచనా ప్రకారం బోట్లు దగ్ధం కారణంగా దాదాపు 12 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టుగా అధికారులు తుది నివేదిక సిద్ధం చేస్తున్నారని సీఎంఓ అధికారులు సీఎం జగన్ కి వివరించారు. అంతకు ముందు విశాఖ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన సమాచారం తెలిసిన వెంటనే సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
-
Balakrishna : థియేటర్లకు తాళాలు పడుతుంటే జాలేస్తోంది.. సినిమాను బతికించుకోవాలి!
-
Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్కు రికార్డ్ వ్యూస్..
-
Astrology: మే 25th సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!