Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Ys Jagan Speech At Kanigiri Public Meeting In Prakasam District

CM YS Jagan: పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది..

Published Date :May 3, 2024 , 5:27 pm
By Mahesh Jakki
CM YS Jagan: పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు అని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని.. ఆయనకు ఓటేస్తే వదల బొమ్మాళీ అంటూ పశుపతిలా బయటకు వస్తాడని విమర్శలు గుప్పించారు. పెన్షన్ల మీదే చంద్రబాబు బృందం గురిపెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు మీరు ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు.. ఇప్పుడు పెన్షన్ మూడు వేలు చేసి ఇంటికి పంపుతుంది ఎవరు అని అడుగుతున్నామని జగన్ ప్రశ్నించారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు చంద్రబాబు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అక్షరాల 66 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. పెన్షన్ కూడా నేరుగా ఇంటికే వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు కన్ను పెన్షన్ల మీద పడిందో ఇబ్బందులు వచ్చాయని.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించారన్నారు. కడుపు మంట చల్లారాక వృద్దులు బ్యాంకుల చుట్టూ పెన్షన్ల కోసం తిరిగేలా చేశాడని ఆరోపించారు. చేసిన దౌర్భాగ్యపు పనిని ఒప్పుకోలేక ఆ నెపాన్ని నాపైనే వేస్తున్నారని సీఎం జగన్‌ ఆగ్రహించారు. దుష్ట చతుష్టయం అంతా కలిసి దారుణమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.

Read Also: AP ELECTIONS: ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన

సీఎం జగన్ మాట్లాడుతూ..”58 నెలల కాలంలో మా పరిపాలన మొత్తం మీరు చూశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే పెద్ద మనిషి పెన్షన్ ఇళ్ళకు పంపాడా..ఏ ఒక్క రోజు కూడా అవ్వాతాతల గురించి ఆలోచించారా.. జూన్ 4 దాకా ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసంతకం మీ కోసమే పెడతా.. మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు.. ఇది జగన్ మాట.. మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతీ కుటుంబానికి పెన్షన్ వచ్చే కార్యక్రమం.. మేము అధికారంలో ఉంటేనే పెంచిన అన్నీ పథకాలు.. ప్రతీ విద్యార్థికి డిజిటల్ చదువులు.. ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. మీ జగన్ అధికారంలో ఉంటేనే బటన్ నొక్కి పథకాలు.. ఇంటికే పౌర సేవలు.. సంక్షేమ పథకాలు.” అందుతాయన్నారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు గుర్తొచ్చేది వెన్నుపోటు తప్ప ఏమైనా ఉందా అని అడుగుతున్నామన్నారు సీఎం జగన్. 14 ఏళ్లు ఏమీ చేయని చంద్రబాబు సూపర్ సిక్స్‌లో పెన్షన్ ఎత్తేశారని విమర్శించారు. పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుందన్నారు. 2014లో మ్యానిఫెస్టోలో చంద్రబాబు చెప్పిన ఒక్క హామీ అయినా జరిగిందా అంటూ ప్రశ్నించారు. “రైతుల రుణాలు మాఫీ చేశాడా.. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా.. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అన్నాడు..ఇచ్చాడా.. ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా.. అర్హులకు పక్కా ఇళ్లు అన్నాడు.. ఇచ్చాడా అని అడుగుతున్నా.. సింగపూరుకు మించిన అభివృద్ధి అన్నాడు చేశాడా.. ప్రత్యేక హోదాను కూడా అమ్మేశాడు.. ఇలాంటి వారిని నమ్మొచ్చా.. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా.. ఒక్కొకరికి కేజీ బంగారం, బెంజి కారు అంటున్నారు నమ్ముతారా..” అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇలాంటి మోసాలను, రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలని.. బంగారు భవిష్యత్తు కోసం ఫ్యాను గుర్తుకు రెండు బటన్లు నొక్కాలని సీఎం స్పష్టం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • AP Pensions Issue
  • chandrababu
  • CM YS Jagan

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions