CM YS Jagan: చంద్రబాబు అరెస్ట్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అందుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తిరుపతిలో నిర్వహించిన ఇండియాటుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది.. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది.. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్వెన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి అన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.. అందుకే చంద్రబాబు 52 రోజులు జైలులో ఉన్నారని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల ముందు ఎవరైనా అపోజిషన్ నేతను అరెస్ట్ చేయాలని అనుకోరన్న ఆయన.. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారు అన్నారు.
Read Also: CM YS Jagan: కాంగ్రెస్ ది డర్టీ గేమ్.. అప్పుడు మా చిన్నాన్న.. ఇప్పుడు నా సోదరి..
Also Read
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఇక, నేను ఏమీ హామీ ఇచ్చాను, నేనే ఏం చేశాను అన్నది చూడాలి అని విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్.. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాను.. అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను అన్నారు. ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత.. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం.. వివక్ష లేకండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించామని వెల్లడించారు. డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చామని పేర్కొన్నారు.. అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో డీబీటీ అమలు చేశాం.. కచ్చితం మేం తిరిగి అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు.. ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది.. ఇప్పుడూ ఉంది.. కానీ, మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు.. కానీ ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందన్నారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!