CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి
- మహిళా రిజర్వేషన్లపై కేంద్రంపై రేవంత్ రెడ్డి విమర్శలు
- బిల్లు వీగిపోవడం చిత్తశుద్ధి లోపమా?
- డిలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం?
- తక్షణ అమలు కోసం కాంగ్రెస్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా తూర్పారబట్టారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం చట్టాల ఓటమి కాదని, అది మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి జరిగిన ఓటమి అని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు (డిలిమిటేషన్), రిజర్వేషన్ల రద్దు వంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా అడ్డుకున్నాయని, ఇది బీజేపీ అహంకారానికి పట్టిన చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లోనే ప్రజలు బీజేపీ కుట్రలను ఓడించారని, ఇప్పుడైనా పంతాలకు పోకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడ్డంకి కాదని, తాము బిల్లుకు వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఒక గంటలో చట్టాన్ని సవరిస్తామని అమిత్ షా గతంలో చెప్పారు కదా.. ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకురండి, ఆ బిల్లు పాస్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది” అని ఆయన సవాల్ విసిరారు. 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే మహిళలకు కేటాయింపులు చేసేలా ఎటువంటి రాజ్యాంగ సవరణలు చేసినా తమ మద్దతు ఉంటుందని, కానీ జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా సీట్ల పెంపును ముడిపెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
Hit and Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను అభినందించాల్సింది పోయి, సీట్ల సంఖ్య తగ్గించి శిక్ష వేయాలని చూడటం దుర్మార్గమన్నారు. సీట్ల పెంపు విధానంపై మోదీ ఎంచుకున్న పద్ధతికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అవసరమైతే కొందరు మగవారి సీట్లను వదులుకోవాల్సి వస్తుందని, తన నియోజకవర్గం రిజర్వ్ అయినా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే క్రమంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భజన రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని హితవు పలికారు. అలాగే, పార్లమెంట్ నిబంధనలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న తేజస్వి సూర్య వంటి నేతలకు కనీస జ్ఞానం కల్పించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..