CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి
- మహిళా రిజర్వేషన్లపై కేంద్రంపై రేవంత్ రెడ్డి విమర్శలు
- బిల్లు వీగిపోవడం చిత్తశుద్ధి లోపమా?
- డిలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం?
- తక్షణ అమలు కోసం కాంగ్రెస్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా తూర్పారబట్టారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం చట్టాల ఓటమి కాదని, అది మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి జరిగిన ఓటమి అని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు (డిలిమిటేషన్), రిజర్వేషన్ల రద్దు వంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా అడ్డుకున్నాయని, ఇది బీజేపీ అహంకారానికి పట్టిన చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లోనే ప్రజలు బీజేపీ కుట్రలను ఓడించారని, ఇప్పుడైనా పంతాలకు పోకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడ్డంకి కాదని, తాము బిల్లుకు వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఒక గంటలో చట్టాన్ని సవరిస్తామని అమిత్ షా గతంలో చెప్పారు కదా.. ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకురండి, ఆ బిల్లు పాస్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది” అని ఆయన సవాల్ విసిరారు. 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే మహిళలకు కేటాయింపులు చేసేలా ఎటువంటి రాజ్యాంగ సవరణలు చేసినా తమ మద్దతు ఉంటుందని, కానీ జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా సీట్ల పెంపును ముడిపెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
Hit and Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను అభినందించాల్సింది పోయి, సీట్ల సంఖ్య తగ్గించి శిక్ష వేయాలని చూడటం దుర్మార్గమన్నారు. సీట్ల పెంపు విధానంపై మోదీ ఎంచుకున్న పద్ధతికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అవసరమైతే కొందరు మగవారి సీట్లను వదులుకోవాల్సి వస్తుందని, తన నియోజకవర్గం రిజర్వ్ అయినా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే క్రమంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భజన రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని హితవు పలికారు. అలాగే, పార్లమెంట్ నిబంధనలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న తేజస్వి సూర్య వంటి నేతలకు కనీస జ్ఞానం కల్పించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!