Revanth Reddy: నేను ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు!
- కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు
- కవిత చేసిందంతా 'అసెంబ్లీ రౌడీ' సినిమా తరహా డ్రామా
- తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి
- కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణకు శత్రువులు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కొరివి దయ్యాలని గతంలోనే అన్నాను. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్కు కవిత లేఖ అంటూ హడావుడి చేశారు. నేను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం ఉండదు, రానివ్వను. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి. కిషన్ రెడ్ది, కేసీఆర్ ఒకటే. సమాజంలో అంతరాలు ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుంది. నక్సలిజం రూపాంతరం చెందుతుంది కానీ.. పూర్తిగా అంతరించదు, అంతరించే అవకాశమే ఉండదు. మానవజాతి మనుగడ సాగించినంతవరకు నిక్సలిజం కూడా మనుగడ సాగిస్తుంది’ అని అన్నారు.
Also Read
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
Also Read: Anganwadi: తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి.. అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ!
‘రెండు రోజుల్లో మీడియా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజల ముందుంచుతాను. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారికే పదవులు, బాధ్యతలు. మా ఇంట్లో నేను మినహాయించి ఎవరూ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. నా సోదరులంతా వాళ్ల వాళ్ల బిజనెస్లు చేసుకుంటున్నారు. కవిత చేసిందంతా “అసెంబ్లీ రౌడీ” సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు భూసేకరణను నేనే క్లియర్ చేశాను’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!