Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Slams Kcr Over Kaleshwaram Project Scam Demands Accountability

CM Revanth Reddy: రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్!

Published Date :September 1, 2025 , 8:10 am
By Sampath Kumar
  • మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ ఫైర్
  • రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు
  • దొర.. దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారు
  • కేసీఆర్.. ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశపడ్డారు
CM Revanth Reddy: రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. దొర.. దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. ఆనాడు వేసిన శిక్షల మాదిరిగా రాళ్లతో కొట్టలేదని, నడి రోడ్డులో ఉరి వేయలేదని.. పద్ధతి ప్రకారం విచారణకు ఆదేశాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. కేసీఆర్.. ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది?, కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల అస్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా? అని సీఎం అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఏకంగా రూ.లక్ష కోట్లు జేబులో వేశారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే.. 75 శాతం నిధులు ఇచ్చే నిబంధన ఉంది. 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్‌ పేరుతో మేడిగడ్డకు మార్చారు. డా బీఆర్ అంబేడ్కర్‌పై కోపంతో కేసీఆర్‌ ప్రాజెక్టు పేరును మార్చి మేడిగడ్డ పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారు. కేసీఆర్, హరీశ్‌రావులు చేసిన అరాచకాలను ఈటల రాజేందర్‌ ఆపలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సరిగా లేవు. ప్రాజెక్టు వైఫల్యం క్షమించరాని నేరమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపం ఉంటే చెప్పాలి. లోపాలుంటే ప్రస్తావించకుండా.. జస్టిస్‌ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు’ అని అన్నారు.

‘పోచారం ప్రాజెక్ట్ నిటారుగా కనపడింది.103 ఏండ్ల ప్రాజెక్టు వర్షాలకు తెగిపోతుంది అనుకున్నాం కానీ బలంగా నిలబడింది. నిర్మాణం, నిర్వహణ, నాణ్యతలో శ్రద్ధ కనపడింది. కానీ కాళేశ్వరం మూడున్నరేలల్లో కట్టడం, కూలడం జరిగింది. కాళేశ్వరంపై విచారణ చేయొద్దు అని అడ్డుకుంటున్నారు. వ్యాప్కో సంస్థ.. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ పెట్టాలని అనుకుంటున్న అని కేసీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వండి అన్నారు, వ్యాప్కో కూడా సరే అని నివేదిక ఇచ్చింది. నువ్వు (కేసీఆర్) అడిగింది ఒకటి ఐతే.. సాంకేతిక నిపుణుడు వేరొకటి ఇవ్వరు కదా?. మేడిగడ్డ నిర్వహణ, నిర్మాణం లోపభూయిష్టం అని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో చెప్పింది. ఇది కాంగ్రెస్ చెప్పలేదు. డిజైన్, నిర్మాణం, మెయింటైన్ చేయడంలో కూడా లోపం ఉంది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్.. ఎన్‌డీయే రిపోర్టని అంటున్నారు. అది ఆయన తెలివి తేటలు. నిజాం కంటే శ్రీమంతుడు కావాలని కేసీఆర్ కోరిక. కేసీఆర్ ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారు’ అని సీఎం చెప్పారు.

Also Read: Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు!

‘మేడిగడ్డ లోపాలు 18.5.2020 రోజునే ఇంజనీర్ లేఖ రాశారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని చెప్పారు. 2020లో మేము అధికారంలో లేము. మీరు అధికారంలో ఉండి లోపాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కేసీఆర్.. హరీష్ సమాధానం చెప్పాలి. ప్రాజెక్టు కూలిపోయిందని అక్టోబర్ 21న మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే లోపాలు బయటపడ్డాయి. ప్రాథమిక నివేదిక కూడా కేసీఆర్‌కి అందింది. ఇందులో భట్టి, శ్రీధర్ బాబు, నా పాత్ర ఏముంటుంది. మేడిగడ్డ చుట్టూ పోలీసులను పెట్టి.. పిట్టని కూడా రానివ్వలేదు. తుమ్మిడి హెట్టి నుండి ప్రాజెక్టు మేడిగడ్డకు మారడానికి కేసీఆర్ కారణం. నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి. ఇప్పటి వరకు మేము రూ.19879 కోట్లు కట్టాం. ఇంకా రూ.60 వేల కోట్ల భారం ఉంద.. తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది, కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల అస్తులు ఎలా వచ్చాయి. ప్రాణహిత ఉసూరు తీసి.. ఉరి వేసింది కేసీఆర్ కాదా?. ఆయనను.. హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా?’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • harish rao
  • Kaleshwaram project
  • Kaleshwaram Project Scam
  • kcr
  • revanth reddy

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions