CM Revanth Reddy: ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు
- ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- మంత్రి సీతక్క..ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ చొరవ
- సీఎంకు తమ సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు
- దీపావళి లోపు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం
- సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు. జైనూరు ఘటన దరిమిలా ఆదివాసులు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని ఆదివాసి సంఘాలను తొడ్కొని సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసి సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అంద చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
Read Also: Gutha Sukender Reddy: మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు.. ఇది సరికాదు..
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు. ఆదివాసీల సమస్యలు సావధానంగా విన్న రేవంత్ రెడ్డి..దీపావళి లోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి ఆదివాసి సంఘాలను, ముఖ్యలను ఆహ్వానిస్తామని, ఆ సమావేశంలోనే ఆదివాసీల డిమాండ్ల సాధ్యసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆదివాసి సంఘాలకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ గా పనిచేసి అక్కడి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్ ను అక్కడికి పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించెందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున ప్రభుత్వానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసి సంఘాల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, సమస్యను పరిష్కరించే దిశలో చూపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!