CM Revanth Reddy : బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ
- ఎడ్యుకేషన్.. ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారు
- పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ
- సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుండి గాంధీ.. వల్లభాయ్ పటేల్ బయలుదేరారని, అదే గుజరాత్ నుండి.. మోడీ.. అమిత్ షా లు బయలు దేరారని, ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుంది… ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.
బుల్లెట్ప్రూఫ్ ఫార్చ్యూనర్.. డీలర్షిప్ ద్వారా కస్టమర్లకు డెలివరీ!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
అంతేకాకుండా..’బీఆర్ఎస్ సన్నాసులు బీజేపీ నీ ఎందుకు నిలదీయడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో.. మలినం అవుతుందో వాళ్ళ ఇష్టం. కేసీఆర్ ఎందుకు బీజేపీ దోపిడీ మీద ఎందుకు స్పందించడం లేదు. ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడరు. బీజేపీకి అనుకూలం కాబట్టే ఆయన స్పందించరు. జేసీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏంటి..? అమిత్ షా.. మోడీని మెప్పించడానికి రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్త అంటున్నారు. ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం అంటున్నారు. చెయ్ వేసి చూడు.. వీపు పగలకొట్టక పోతే పేరు మార్చుకుంట. తెలంగాణ కి తల్లి సోనియా గాంధీ. సచివాలయం బయట కాదు.. లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. పదేళ్లు ఈ సన్నాసులు ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం. రైతుల ముసుగులో బీఆర్ఎస్ ధర్నా లు.
Chiranjeevi: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని
ఏ రైతుకు మాఫీ కాకున్నా..కలక్టర్ కార్యాలయం లో కౌంటర్ పెట్టిన. 18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం. కేటీఆర్… తప్పుడు మాటలు మానుకో మాది ప్రజా పాలన రైతులకు..ప్రజలకు అందుబాటులో ఉన్నాం. రోజూ మేము 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నాం. ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది. ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నారు మీరు. కాకుల లెక్క.. గద్దల లెక్క పిక్కుతున్నది వీళ్లే కదా. కేటీఆర్..హరీష్ లాంటి సన్నాసులు కదా మిమ్మల్ని దోచుకుంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారు. పదేళ్లలో మీరు ఎంత మాఫీ చేశారు.. మేము ఎంత చేశామో చర్చకు సిద్దం. నెక్టు మా జగ్గన్న నే చూసుకుంటారు. సోషల్ మీడియా నీ నమ్ముకున్న మోడీ ఏమయ్యారు. మీరు అంతే ఐతరు 400 గెలుస్త అని మోడీ ప్రచారం చేసుకున్నారు..ఏమైంది. వచ్చే ఎన్నికల్లో 39 లో 9 కూడా రావు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..