CM Revanth Reddy : బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ
- ఎడ్యుకేషన్.. ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారు
- పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ
- సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుండి గాంధీ.. వల్లభాయ్ పటేల్ బయలుదేరారని, అదే గుజరాత్ నుండి.. మోడీ.. అమిత్ షా లు బయలు దేరారని, ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుంది… ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.
బుల్లెట్ప్రూఫ్ ఫార్చ్యూనర్.. డీలర్షిప్ ద్వారా కస్టమర్లకు డెలివరీ!
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
అంతేకాకుండా..’బీఆర్ఎస్ సన్నాసులు బీజేపీ నీ ఎందుకు నిలదీయడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో.. మలినం అవుతుందో వాళ్ళ ఇష్టం. కేసీఆర్ ఎందుకు బీజేపీ దోపిడీ మీద ఎందుకు స్పందించడం లేదు. ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడరు. బీజేపీకి అనుకూలం కాబట్టే ఆయన స్పందించరు. జేసీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏంటి..? అమిత్ షా.. మోడీని మెప్పించడానికి రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్త అంటున్నారు. ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం అంటున్నారు. చెయ్ వేసి చూడు.. వీపు పగలకొట్టక పోతే పేరు మార్చుకుంట. తెలంగాణ కి తల్లి సోనియా గాంధీ. సచివాలయం బయట కాదు.. లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. పదేళ్లు ఈ సన్నాసులు ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం. రైతుల ముసుగులో బీఆర్ఎస్ ధర్నా లు.
Chiranjeevi: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని
ఏ రైతుకు మాఫీ కాకున్నా..కలక్టర్ కార్యాలయం లో కౌంటర్ పెట్టిన. 18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం. కేటీఆర్… తప్పుడు మాటలు మానుకో మాది ప్రజా పాలన రైతులకు..ప్రజలకు అందుబాటులో ఉన్నాం. రోజూ మేము 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నాం. ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది. ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నారు మీరు. కాకుల లెక్క.. గద్దల లెక్క పిక్కుతున్నది వీళ్లే కదా. కేటీఆర్..హరీష్ లాంటి సన్నాసులు కదా మిమ్మల్ని దోచుకుంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారు. పదేళ్లలో మీరు ఎంత మాఫీ చేశారు.. మేము ఎంత చేశామో చర్చకు సిద్దం. నెక్టు మా జగ్గన్న నే చూసుకుంటారు. సోషల్ మీడియా నీ నమ్ముకున్న మోడీ ఏమయ్యారు. మీరు అంతే ఐతరు 400 గెలుస్త అని మోడీ ప్రచారం చేసుకున్నారు..ఏమైంది. వచ్చే ఎన్నికల్లో 39 లో 9 కూడా రావు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!