CM Revanth Reddy : కారు ఇక తుకానికి పోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా వాళ్లు చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన కేసీఆర్… సాయన్నకు మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదన్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోరని, కంటోన్మెంట్ ప్రజల ఓట్లు తొలగించి మీకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా..’ఎలివేటేడ్ కారిడార్ జాప్యంతో ఈ ప్రాంతం ట్రాఫిక్ జామ్ తో అతలాకుతలమైంది.. తాగు నీటి సమస్య, రోడ్ల సమస్య పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలవాలి.. ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలు పతిష్కారమవుతాయి.. శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా, సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి.. మీ నాయకుడిగా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.. ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేకపోతే ఎంపీగా ఉన్నప్పుడు ఆసుపత్రి నిర్మించి మీ సమస్యను పతిష్కరించా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తున్నాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తున్నాం.. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఎలివేటేడ్ కారిడార్ కు శంకుస్థాపన చేసుకున్నాం.. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది… కంటోన్మెంట్ లో 25వేల మెజారిటీతో శ్రీగణేష్ ను గెలిపించండి..
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
కంటోన్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి 25వేల మెజారిటీ ఇవ్వండి…సునీతమ్మకు వేసే ప్రతీ ఓటు మీ రేవంత్ అన్నకు వేసినట్టే.. ఈ ఆడబిడ్డను గెలిపించి పార్లమెంట్ కు పంపండి… కేసీఆర్ చచ్చిన పాముతో సమానం… ఇక ఆయన కథ కంచికే. బస్సు యాత్ర తరువాత ఇక ఆయనకు తీర్ధ యాత్రలే దిక్కు.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది… దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. బీజేపీ కి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు… రిజర్వేషన్లు రద్దు చేసి.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది..బీజేపీ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీపై ఉంది.. రిజర్వేషన్ల రద్దుపై ఈటెల రాజెందర్ వైఖరి ఏంటో చెప్పాలి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడండి.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!