CM Revanth Reddy : చేవెళ్ల ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి, స్పీకర్ పదవి దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువచ్చారని, వికారాబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు రద్దు చేసి కేసీఆర్ ఎడారిగా మార్చాడని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాలేదని, పాలమూరు రంగారెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డికి బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని, కందులకు సరైన మద్దతు ధర రాకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’వికారాబాద్ శాటీ లైైట్ సిటీ ఆగిపోయింది.. మురికి కూపంలా తయారైన మూసీ బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రైతు బంధు నిధులు ఇస్తే కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశా… రైతు బంధు నిధులు 7 వ తేదీన వేశాను… కేసీఆర్ నీకు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయి.. అనంతగిరి కొండల్లో పద్మనాభుని సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా.. రైతు రుణం తీర్చుకోకపోతే ఈ ముఖ్యమంత్రి పదవి నిష్ప్రయోజనం.. రైతు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదే.. సంక్రాంతి పండుగ కు గంగిరెద్దులా మోదీ, అమిత్ షా తెలంగాణ కు రోజూ వస్తున్నారు.. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, మెట్రో రైలు, ఐటీ కంపెనీలను రాష్ట్ర విభజన సమయంలో సోనియమ్మ రాష్ట్రానికి ఇచ్చింది.. తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలి.. తెలంగాణ బీజేపీ ఇచ్చింది, మోదీ తెచ్చింది గాడిద గుడ్డు.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఎల్లమ్మ,పోచమ్మ పండుగ లు మనం చేయలేదా.. దేవుడి పేరు మీద విభజించాలని బీజేపీ చూస్తోంది.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ..వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు మీద ఓట్లు భిక్షమెత్తుకునే వారు హిందూ ద్రోహి…. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి కి లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలి..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
తాజావార్తలు
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..