T20 World Cup: భారత్లో ఆడటంపై బంగ్లాదేశ్ కీలక ప్రతిపాదన.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్..
- కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ వివాదం..
- భారత్లో ఆడబోమంటున్న బంగ్లాదేశ్..
- ఐర్లాండ్తో తమ జట్టును మార్చాలని ఐసీసీకి వినతి..
- షెడ్యూల్ మారే అవకాశం లేదన్న క్రికెట్ ఐర్లాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: 2026 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత నేపథ్యంలో భారత్, బంగ్లాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను ఐపీఎల్ టీమ్ కేకేఆర్ నుంచి డ్రాప్ చేయడంపై బంగ్లా బోర్డు ఆగ్రహంతో ఉంది. దీంతో భారత్లో ఆడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని బంగ్లాదేశ్ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి తాము ఆడే అన్ని T20 ప్రపంచ కప్ మ్యాచ్లను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్( BCB) ఐసీసీని కోరింది.
Read Also: Bhatti Vikramarka: ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. ఆ ఛానెల్ కథనంపై భట్టి విక్రమార్క ఫైర్..
Also Read
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
ఇదిలా ఉంటే, ఐసీసీతో శనివారం జరిగిన మీటింగ్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కీలక ప్రతిపాదన చేసింది. తమ గ్రూప్ను ఐర్లాండ్ గ్రూప్తో మార్చాలని ఐసీసీని కోరింది. బంగ్లాదేశ్ తన అన్ని గ్రూప్ మ్యాచులను శ్రీలంకలో ఆడాలని భావిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ మ్యాచ్లు అన్నీ కూడా కోల్కతా, ముంబై వేదికలుగా ఉన్నాయి. అయితే, భద్రతా కారణాలను చూపుతూ భారత్ రావడానికి సిద్ధంగా లేమని బంగ్లా బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
అయితే, బంగ్లా ప్రతిపాదనపై క్రికెట్ ఐర్లాండ్(CI) స్పందించింది. తమ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పింది. మా షెడ్యూల్ మారదని మాకు స్పష్టమైన హామీలు లభించాయని, మేము గ్రూప్ దశలో అన్ని మ్యాచులు కూడా శ్రీలంకలోనే జరుగాయని ఐర్లాండ్ అధికారి వెల్లడించారు. ఐర్లాండ్ ఇప్పటికే షెడ్యూల్ మారదని స్పష్టం చేయడంతో, ఐసీసీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్లు గ్రూప్ Bలో ఉంది. అదే సమయంలో, బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్ , నేపాల్లతో పాటు గ్రూప్ Cలో ఉంది.
తాజావార్తలు
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!