CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- 1500 ఎకరాల్లో భారీ డేటా సిటీ ఏర్పాటు దిశగా తెలంగాణ
- బుల్లెట్ ట్రైన్ భూ సేకరణ పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్
- టీ-ఫైబర్కు మూడు నెలల డెడ్లైన్ విధించిన సీఎం
- టైర్-2 నగరాల్లో GCCలు, డేటా సెంటర్లపై ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ , డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ లో జరిగిన పరిశ్రమలు, ఐటీ శాఖల రివ్యూ మీటింగ్లో రాష్ట్రంలో డిజిటల్ నెట్వర్క్, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఏకంగా 1500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఒక సరికొత్త ‘డేటా సిటీ’ (Data City) ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం అనౌన్స్ చేశారు.
ఈ ప్రతిష్టాత్మక డేటా సిటీ నిర్వహణకు భారీగా నీటి అవసరాలు ఉంటాయని, అందుకోసం ప్యూర్ వాటర్ కాకుండా ఎస్ టీ పీ (STP – Sewage Treatment Plant) ల ద్వారా రీసైకిల్ చేసిన నీటిని వినియోగించేలా ప్లాన్ చేయాలని అధికారులకు సీఎం గైడెన్స్ ఇచ్చారు. అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs), పెద్ద పెద్ద డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలలో (Tier-2 Cities) కూడా ఈ జీసీసీల ఏర్పాటుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేలా సరికొత్త ఐటీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావాలన్నారు.
Also Read
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాబోయే బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) పనులను తక్షణమే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అయిన టీ-ఫైబర్ (T-Fiber) పై సీఎం రేవంత్ రెడ్డి కఠిన డెడ్లైన్ విధించారు. రాబోయే మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (Government Offices) తప్పనిసరిగా టీ-ఫైబర్ నెట్వర్క్కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను కూడా మన ఫ్యూచర్ సిటీకే వచ్చేలా చూడాలని, అవసరమైతే దీని కోసం తాను స్వయంగా ప్రధాని మోడీని కలిసి రిక్వెస్ట్ చేస్తానని సీఎం అధికారులతో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
-
Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
-
Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!