CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- 1500 ఎకరాల్లో భారీ డేటా సిటీ ఏర్పాటు దిశగా తెలంగాణ
- బుల్లెట్ ట్రైన్ భూ సేకరణ పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్
- టీ-ఫైబర్కు మూడు నెలల డెడ్లైన్ విధించిన సీఎం
- టైర్-2 నగరాల్లో GCCలు, డేటా సెంటర్లపై ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ , డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ లో జరిగిన పరిశ్రమలు, ఐటీ శాఖల రివ్యూ మీటింగ్లో రాష్ట్రంలో డిజిటల్ నెట్వర్క్, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఏకంగా 1500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఒక సరికొత్త ‘డేటా సిటీ’ (Data City) ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం అనౌన్స్ చేశారు.
ఈ ప్రతిష్టాత్మక డేటా సిటీ నిర్వహణకు భారీగా నీటి అవసరాలు ఉంటాయని, అందుకోసం ప్యూర్ వాటర్ కాకుండా ఎస్ టీ పీ (STP – Sewage Treatment Plant) ల ద్వారా రీసైకిల్ చేసిన నీటిని వినియోగించేలా ప్లాన్ చేయాలని అధికారులకు సీఎం గైడెన్స్ ఇచ్చారు. అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs), పెద్ద పెద్ద డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలలో (Tier-2 Cities) కూడా ఈ జీసీసీల ఏర్పాటుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేలా సరికొత్త ఐటీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావాలన్నారు.
Also Read
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాబోయే బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) పనులను తక్షణమే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అయిన టీ-ఫైబర్ (T-Fiber) పై సీఎం రేవంత్ రెడ్డి కఠిన డెడ్లైన్ విధించారు. రాబోయే మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (Government Offices) తప్పనిసరిగా టీ-ఫైబర్ నెట్వర్క్కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను కూడా మన ఫ్యూచర్ సిటీకే వచ్చేలా చూడాలని, అవసరమైతే దీని కోసం తాను స్వయంగా ప్రధాని మోడీని కలిసి రిక్వెస్ట్ చేస్తానని సీఎం అధికారులతో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!