Ponnam Prabhakar: మంత్రి చేతుల మీదుగా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం..!
- సికింద్రాబాద్ RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా సారధి పోర్టల్ ప్రారంభోత్సవం
- పోర్టల్ ప్రారంభించిన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్...
- వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్
- రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలను సులభతరం చేసేందుకు ఉపయోగపడనున్న పోర్టల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేందర్ మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లతోపాటు రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు.
Read Also: CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!
Also Read
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఈ వాహన్ సారథి పోర్టల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడంల దోహద పడనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యకలాపాలను ఆటోమేట్ చేస్తుంది. ఇందులో వాహనాలకు సంబంధించి పర్మిట్లు, అలాగే డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ పోర్టల్ లో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అనుసంధానమైనా.. ఇన్ని సంవత్సరాల తర్వాత జాతీయ పోర్టల్ లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ సమాచార కేంద్రం ద్వారా వాహనాలకు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన అన్ని రకాల వివరాలన్నింటిని ఈ పోర్టల్ నమోదు చేయనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పుల వంటి పనులను చేసుకునే అవకాశం కలగనుంది.
Read Also: India Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్లో ఎండిపోయిన చీనాబ్ నది..
ఈ సందర్బంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రవాణా శాఖా కేంద్రం, రాష్ట్రాలు కలిపి నడిపించాల్సిన వ్యవస్థ. కేంద్ర తెచ్చిన వాహన సారధి పోర్టల్ ను ఆలస్యంగా మనం భాగం అయ్యాము. ఈ అనుసంధానం వల్ల ఫెడరల్ సిస్టంలో భాగం అయ్యామని ఆయన అన్నారు. రవాణా శాఖాలో సంస్కరణలు తీసుకొస్తున్నాం.. ప్రమాదాల నివారణ కోసం రోడ్ భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం.. పిల్లలకు రోడ్ అవేర్నెస్ పార్క్ లను ఏర్పాటు చేశామని, అందుకు పిల్లలకు అవగాహన అవసరమని అన్నారు. AI ద్వారా రవాణా శాఖలో తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లాంటివి నిర్వహిస్తామని.. పొల్యూషన్ పెరగకుండా పాలసీ తీసుకొచ్చాం.., 15 ఏళ్ళు దాటిన వాహనాలకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.. ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్న వాహనదారుల సపోర్ట్ అవసరమని ఆయన అన్నారు. మధ్యవర్తిత్వం అవసరం లేకుండా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. కుల గణన పై కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటాం అని చెప్పింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..