CM Revanth Reddy : ప్రతి పేదవాడికి రేషన్కార్డు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం
- ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- అన్ని చోట్ల అధ్యయనం చేసి డిజిటల్ కార్డును రూపొందించాం
- ప్రతి పేదవాడికి రేషన్కార్డు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం
- 30 శాఖల దగ్గర సమాచారాన్ని క్రోడీకరించి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరిచాం
- ఒక్క క్లిక్తో లబ్దిదారుల సమాచారం అంతా తెలుస్తుంది
- అన్ని సంక్షేమ పథకాలకు ఒకటే కార్డు : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సికింద్రాబాద్లోని హాకీ గ్రౌండ్స్లో “ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ల” పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని.. కానీ ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు అందించాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వివిధ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేశామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్లను ప్రవేశపెట్టామన్నారు. “సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ శాఖల సమాచారం ఈ ఒకే కార్డులో పొందుపరచబడుతుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ద్వారా కేవలం ఒక క్లిక్తో 30 శాఖల సమాచారాన్ని పొందవచ్చని ప్రభుత్వం నిర్ధారిస్తోంది” అని ఆయన చెప్పారు.
Adani- Google Deal: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్తో అదానీ గ్రూప్ డీల్..
Also Read
అర్హత ఉన్న కుటుంబాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ రక్షణ కవచంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ , ఇతర సంక్షేమ పథకాలకు కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. “డిజిటల్ కార్డ్ మహిళను కుటుంబ పెద్దగా గుర్తిస్తుంది” అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ తప్పిదాలు, అప్పుల కారణంగా రాష్ట్రం మునిగిపోతోందని, ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్న కొద్దీ అప్పులు తీర్చుకుంటున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నవారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి భూమిని బదలాయించి కంటోన్మెంట్ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రేవంత్రెడ్డి.. నిరుద్యోగులను పదేళ్లుగా పీడించారని, అందుకే ప్రజలు తమను గద్దె దించారని, ఉద్యోగ నియామకాలు ప్రారంభించామని ఆయన వివరించారు.
Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..