CM KCR: ఈసారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తాం..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మీకు మీరు ఆలోచన చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సంపద పెంచామని…మళ్ళీ తాము గెలిస్తే 5 వేల పెన్షన్ అందిస్తామని చెప్పారు.
PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్లో ప్రధాని మోడీ..
Also Read
కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి వంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ.. ఇంకా పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖానాపూర్ నియోజక వర్గంలో 7300 పోడు భూమి పట్టాలు ఇస్తూ.. వారందరికీ రైతు భరోసా ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత దేశంలో మొదటి సారి రైతు బంధును పుట్టించిందే తాను అని సీఎం కేసీఆర్ అన్నారు.
PM Modi: సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం
మరోవైపు కాంగ్రెసోళ్లు.. రైతు బంధు వద్దని అంటున్నారు… రైతు బంధు కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ కావాలంటే జాన్సన్ నాయక్ ను గెలిపించండని అక్కడి జనాలను ముఖ్యమంత్రి కోరారు. అందరు మీ గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టండి.. అన్ని కులంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకోండి… ఎవరు అభివృద్ధి చేశారు.. ఎవరు చేస్తారని మీరే నిర్ణయం తీసుకోండి అని అన్నారు. జాన్సన్ నాయక్ మా ఇంటి బిడ్డ లెక్క గెలిపించండి.. అభివృద్ధి చేస్తాడని సీఎం కేసీఆర్ చెప్పారు.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో