PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్లో ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు భారతీయ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
‘‘ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 5 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్లకు షాపింగ్ చేసేటప్పుడు, మీరందరూ భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని ప్రధాని మోడీ అన్నారు. ‘‘పెళ్లిళ్ల టాపిక్ వచ్చినప్పుడు చాలా కాలంగా ఒక విషయం నన్ను కలవరపెడుతోంది. ఈ విషయాన్ని నేను నా కుటుంబసభ్యులతో కాకుంటే ఇంకెవరికి చెప్తాను. ఒక్కసారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే వాతారణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా..? ’’ అని మోడీ అడిగారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: China Pneumonia: చైనాలో కొత్త వ్యాధి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
భారతగడ్డపై దేశంలోని ప్రజల మధ్య వివాహం జరుపుకుంటే, దేశంలోని డబ్బు దేశంలోని ఉంటుందని ప్రధాని అన్నారు. ఇలాంటి పెళ్లిళ్లలో దేశ ప్రజలకు ఏదో ఒక సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆయన సూచించారు. నిరుపేదలు కూడా మీ పెళ్లి గురించి తమ పిల్లలకు చెబుతారు. మీరు ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సూచించారు. మీరు కోరుకునే వ్యవస్థ ఈరోజు ఉండకపోవచ్చు, కానీ మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే, వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందుతాయని, నా బాధ ఖచ్చితంగా పెద్దవారికి చేరుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.
దేశ నిర్మాణ బాధ్యతలను ప్రజలు పెద్దగా తీసుకున్నప్పుడు, ఈ దేశాన్ని ముందుకు సాగకుండా ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజలు అనేక మార్పులకు నాయకత్వం వహిస్తు్న్నారనేది నేడు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దీనికి పండగ సీజన్ ఒక ఉదాహరణ అని.. తగ కొద్ది రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. మన పిల్లలు షాపులో కొనుగోలు చేసేటప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉందా లేదా అని చూడాలని కోరారు. మీరు డిజిటల్ మాధ్యమం ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని నిర్ణయించుకోవాలని, నగదు ద్వారా కాదని ప్రధాని ప్రజలను కోరారు.
తాజావార్తలు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!