CM KCR : తెలంగాణలో ఉపాధ్యాయులకు గుడ్న్యూస్.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుకగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదముద్ర వేసింది. ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బదిలీలు మరియు పదోన్నతుల కోసం. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. తొలుత హెచ్ఎంలను బదిలీ చేసి 9,266 పోస్టులకు టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తామని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలు కూడా చేపడతామని ఆమె తెలిపారు. గతంలో మాదిరిగానే వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విధానంలో మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, బదిలీలు, పదోన్నతులు సజావుగా జరిగేందుకు ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బదిలీలు మరియు పదోన్నతులు చేపట్టినప్పటికీ, ఇది ఏప్రిల్ 23 నుండి అమల్లోకి వస్తుందని, ముఖ్యంగా ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల విద్యావేత్తలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఆమె తెలిపారు.
Also Read : Economic Forum: దావోస్ వేదికగా ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్.. పాల్గొననున్న మంత్రులు
Also Read
ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే.. ఈరోజు ఉదయం మంత్రి హరీష్ రావు, విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హరీష్ రావు ఇంటివద్ద ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీల వారీగా విడి విడిగా సమావేశం నిర్వహించారు. యుయస్పీసితో జరిగిన సమావేశంలో బదిలీలు, పదోన్నతులు ఒకేసారి నిర్వహించటానికి అంగీకరించారు. అయితే బదిలీ అయిన లేదా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను లాస్ట్ వర్కింగ్ డే రిలీవ్ చేస్తారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ అన్ని కలిపి 11,000 ప్రమోషన్స్ వస్తాయి.
స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 960 పోస్టులకు పాత పద్దతిలో పదోన్నతులు ఇస్తారు. అప్గ్రేడెడ్ పోస్టులు 10479 పై కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం వాటికి ప్రమోషన్స్ ఇస్తారు. జిఓ 158 ప్రకారం ఎంఈఓ, డైట్ లెక్చరర్ ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని కోరగా, ప్రాతినిధ్యాన్ని పరిశీలించి న్యాయ సలహా తీసుకుని షెడ్యూల్ లో చేర్చాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరుపుతామని సంఘాలు సహకరించాలని కోరారు.జిఓ 317 బాధితుల గురించి ప్రస్తావించగా బదిలీలకు ముందుగానే సానుకూలంగా నిర్ణయం తీసుకుటామన్నారు. పండుగ రోజు శుభవార్త చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. యుయస్పీసి పక్షాన కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎన్ యాదగిరి, ఎస్ హరికృషన్, బి కొండయ్య, రామలింగం, టి లక్ష్మారెడ్డి, పి మాణిక్ రెడ్డి, నాగరాజు గౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!