Economic Forum: దావోస్ వేదికగా ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్.. పాల్గొననున్న మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Economic Forum Summit: స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా సోమవారం ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ థీమ్ ‘విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం’ అని నిర్ణయించారు.
ఈ సమ్మిట్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం, ప్రపంచ ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు వంటి కొన్ని ముఖ్యమైన సమస్యలను చర్చించనున్నారు. ఈ సమ్మిట్ వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించనున్నారు. ఈ సమ్మిట్కు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ఎం రామఫోసా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్, స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్తో పాటు పలువురు ప్రపంచ నేతలు పాల్గొననున్నారు.
Also Read
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. 'పెద్ది' సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
Heart Disease: రోజుకు 6 వేల-9 వేల అడుగులు నడవండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి..
భారత్ నుంచి కూడా పలువురు నేతలు ఈ సమ్మిట్లో భాగస్వామ్యం కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవియా, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్ హాజరుకానుండగా.. ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బిఎస్ బొమ్మై, యోగి ఆదిత్యనాథ్ సభకు హాజరవుతారని సమాచారం. వీరే కాకుండా టాటా సన్స్ ఇండియా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథ్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ వంటి పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొననున్నారు. బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!