CM JAGAN: రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సమీక్షకు మంత్రి జోగి రమేష్, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
Read Also: Congress: డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలి.. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది.. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.. ఈ విషయాన్ని రైతులకు చెప్పండి అని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలి.. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి.. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను అధికారులు తీసుకుంటారు.. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ తెలిపారు.
Read Also: Auto Drivers Union: మహిళలకు ఫ్రీ బస్.. ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల హెచ్చరిక
సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది అని సీఎం జగన్ చెప్పారు. సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్.. 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్లు అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సవరణలు, అభ్యంతరాల స్వీకరణతో పాటు 26న జిల్లా కలెక్టర్లు తుది జాబితా ప్రకటిస్తారని సీఎం జగన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!