CM Jaganmohan Reddy: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కుపై సీఎం సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గనులశాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడంలేదన్నారు సీఎం. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని తెలిపారు సీఎం.
నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జాప్యానికి తావులేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. రెవిన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందన్నారు అధికారులు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్నారు సీఎం. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలన్నారు సీఎం. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు సీఎం.
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
Read Also:Mosquito Coil : ఆరుగురిని బలి తీసుకున్న మస్కిటో కాయిల్
అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలన్న సీఎం. రోవర్ తరహా… పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్న సీఎం. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్ధాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలపై ఆలోచనలు చేయాలన్న సీఎం. సర్వే పూర్తైన తర్వాత సరిహద్దులు వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధంచేశామని తెలిపిన అధికారులు. రోజుకు 50వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరాచేసేందుకు ప్రణాళిక వేసుకున్నామన్న అధికారులు.
తర్వాత దశల్లో జరిగే సర్వే ప్రక్రియ కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలన్నారు సీఎం. మున్సిపల్ ప్రాంతాల్లో చేయాల్సిన సర్వేకోసం సన్నాహాలు చేసుకుంటున్నామన్నారు మున్సిపల్ శాఖ అధికారులు. దీనికి సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతుందన్న అధికారులు. నిర్దేశించుకున్న టైం లైన్స్ ప్రకారం కచ్చితంగా సర్వే ప్రాంతాల్లో పూర్తిచేయాలన్నారు సీఎం. ఏప్రిల్ మూడో వారం నాటికి ౩౦౦ గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు పంచాయతీరాజ్ అధికారులు. డిసెంబరులోగా మొత్తం అన్ని గ్రామాల్లో ఈ సర్వే పూర్తిచేసేదిశగా లక్ష్యాలను పెట్టుకున్నామన్నారు అధికారులు.
Read Also: Congress: విదేశాల జోక్యంతో తత్వం బోధపడింది… రాహుల్ విషయంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!