CM Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి కుప్పంకు చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే..
- తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు సిద్ధమైన సీఎం చంద్రబాబు
- రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటన
- ఈ నెల 25.. 26 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం కుప్పం పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు అధికారులు.. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం కుప్పం పర్యటన కొనసాగనుండగా.. 25న మధ్యాహ్నం 12:30 కు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారు.. 1:30కి ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. 3:30కి పీఈఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Toxic Liquor: తమిళనాడులో 55కి చేరిన మృతుల సంఖ్య.. 88 మందికి చికిత్స..!
Also Read
- గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
- FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఇక, రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం 10 గంటలకు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు ప్రజల నుండి వినతులను స్వీకరింనున్న ఆయన.. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పీఈఎస్ కళాశాలలోని ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు.. ఇక, సాయంత్రం 4:30 గంటలకు రెండు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కుప్పంలో చంద్రబాబు విజయఢంకా మోగించిన విషయం విదితమే.. తన సమీప ప్రత్యర్థి కేఆర్జే భరత్ పై 47,340 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చంద్రబాబు.. 1989 నుంచి కుప్పం నుండి పోటీ చేస్తూ వస్తున్న చంద్రబాబు.. తొమ్మిదోసారి కూడా కుప్పం నుండి గెలుపొందిన విషయం విదితమే.
తాజావార్తలు
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!