Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Says Tdp Workers Are Real Leaders At Party Cluster Training Meet

CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి..

Published Date :April 24, 2026 , 7:20 pm
By Sudhakar Ravula
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, వారు రైట్ రాయల్‌గా బతకాలని అన్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా తరగతులకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేకంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమం నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆ అవకాశాన్ని పార్టీ కేడర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మంచి చేస్తే వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, వారు రైట్ రాయల్‌గా బతకాలని అన్నారు. పార్టీ కూడా కార్యకర్తలకు అదే స్థాయిలో గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు.

Read Also: PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్‌ తొలగింపు

Also Read

  • Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
  • AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్‌.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

రాష్ట్ర అభివృద్ధి సుదీర్ఘ కాలం స్థిరమైన పాలనతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. తనను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలను మాత్రం కాపాడుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ప్రస్తుతం తాము చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ పథకాల అమలుకు పడుతున్న కష్టాన్ని తెలియజేయాలని అన్నారు చంద్రబాబు..

వైసీపీని ఉద్దేశిస్తూ ‘కిల్లర్ పార్టీ’, ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శించారు టీడీపీ అధినేత.. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి తగిన కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎన్నికల వరకు వాడుకున్నారని, అధికారంలోకి వచ్చాక న్యాయం కోరిన సునీతారెడ్డిని బెదిరించారని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, ఇలాంటి రాజకీయ శైలి తన జీవితంలో చూడలేదని చంద్రబాబు అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును కూడా ప్రస్తావిస్తూ, నేరాలకు పాల్పడి తరువాత ఆరోపణలు ఇతరులపై నెడుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలకు నిరంతరం వివరించాలని, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను చాటాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • AP CM Chandrababu
  • Chandrababu comments on YSRCP
  • Chandrababu Latest Speech
  • Chandrababu Naidu

తాజావార్తలు

  • CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి..

  • Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!

  • RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?

  • PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్‌ తొలగింపు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions